English | Telugu

బోల్డ్ క్యారెక్టర్స్ చేసినా ఇబ్బంది ప‌డ‌లేదు.. 'కార్తీక‌దీపం' న‌టి!

'కార్తీకదీపం' సీరియల్ లో అర్ధపావు భాగ్యం క్యారెక్టర్ పోషిస్తోన్న నటి ఉమ తన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. సీరియల్‌లో ఆమెతో చేయించే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ నటి ఒకప్పుడు సినిమాల్లో కూడా నటించింది. కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా కనిపించింది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైన సవాళ్లను, అనుభవాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సినిమా, టీవీ ఇండస్ట్రీలో నటించాలంటే ఇబ్బందులు వస్తాయని అనుకుంటే.. ఎక్కడైనా ఇబ్బందే అని.. ఇబ్బంది ఉండదు అనుకుంటే ఎక్కడా ఉండదని చెప్పింది.

పనికోసం చాలా మంది ఎన్నో విధాలుగా ఎదురుచూస్తున్నారని.. మనం కావాలనుకున్న పని దొరికినప్పుడు దైవంగా భావించి చేస్తే ఎలాంటి ఇబ్బంది కనిపించదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ల తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇబ్బందిగా ఫీలైన సందర్భం లేదని చెప్పింది. ఎదుటివారితో ఇష్టంగా, ప్రొఫెషనల్ గా నటించాలని.. లేదనుకుంటే ఇంట్లో కూర్చోవాలని చెప్పుకొచ్చింది. తనకైతే ఇండస్ట్రీలో ఎలాంటి చెడు అనుభవం ఎదురుకాలేదని.. ఎవరి వలన ఇబ్బంది పడలేదని స్పష్టం చేసింది.

తను బోల్డ్ పాత్రల్లో నటించినప్పుడు కూడా పెద్ద ఇబ్బందులు రాలేదని.. ఒక ఆర్టిస్ట్ తన కెరీర్‌ని ప్రొఫెషనల్‌గా భావించినప్పుడు ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాడని.. తను కూడా అంతేనని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈ క్యారెక్టర్ ఎందుకు చేశానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. మంచి తొందరగా వెళ్లదు.. చెడు తొందరగా వెళ్తుందని చెప్పడానికి తను చేసిన బోల్డ్ పాత్రలే ఉదాహరణ అని చెప్పింది. తను చాలా తక్కువగా బోల్డ్ పాత్రలు చేశానని.. కానీ ఇప్పటికీ వాటి గురించే చెప్పుకుంటారని వెల్లడించింది. భవిష్యత్తులో తనకు పిచ్చిదాని క్యారెక్టర్ చేయాలని ఉందని.. అందులో వైవిధ్యాన్ని ప్రదర్శించాలనుందని చెప్పుకొచ్చింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.