English | Telugu

మా నాన్నకు ఆ పిచ్చి.. దాని వ‌ల్లే ఆస్తులు పోగొట్టుకున్నాం!

ఒక‌వైపు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోన్న అనసూయ.. మరోపక్క వెండితెరపై నటిగా తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై జరిగే ట్రోలింగ్‌కు ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి గతంలో చాలా సార్లు చెప్పింది. అమ్మానాన్న, చెల్లెళ్లు, భర్త గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.

అయితే లేటెస్ట్‌గా కొన్ని కొత్త విష‌యంలు పంచుకుంది అనసూయ. తన చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానని చెబుతోంది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని.. డబ్బులు సరిపోక బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని వివరించిన అనసూయ.. తన తండ్రి గురించి చెబుతూ తమను ఎలా పెంచారో చెప్పుకొచ్చింది. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని.. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడతామో, ఎలా హ్యాండిల్ చేస్తామోనని దూరం నుండి చూసేవారని ఆ మధ్య అనసూయ తెలిపింది.

తాజాగా తన తండ్రి గురించి మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు చాలా రిచ్ గానే పెరిగామని.. ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని తెలిపింది. తమ దగ్గర చాలా గుర్రాలు ఉండేవని.. తన తండ్రికి హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ అంటే పిచ్చి అని.. అలా ఆస్తులన్నీ పోగొట్టుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల సినిమాల్లో నటిస్తోంది!

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.