English | Telugu

నాగార్జున గారిని చూస్తే ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది

కితకితలు మూవీ ద్వారా బాగా ఫేమస్ ఐన నటి గీతాసింగ్. ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను బాడీ షేమింగ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నారు. ఐతే ఈమె బిగ్ బాస్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఒక ఇంటర్వ్యూలో. "నా ఫాన్స్ అంతా అడుగుతున్నారు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్లడం లేదు అని. నాకు బిగ్ బాస్ లోకి వెళ్లడం అంటే ఇష్టం. అందరూ ఆడినట్టే ఆడతాను. స్క్రిప్ట్ ఇస్తారు కదా టాస్కులు ఆడమంటూ అలాగే ఆడతాను. ఆల్రెడీ కితకితలు మూవీలో స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసారికి అల్లరి నరేష్ గారు ఎగిరిపోయారు ఇక బిగ్ బాస్ లో ఉండేదే చిన్న స్విమ్మింగ్ పూల్ అందులో నేను దూకితే మిగతా వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు వాళ్లకు ఎలా సరిపోతుంది. మిగతా వాళ్ళు పారిపోడానికి కూడా లేదు. గేట్స్ మూసేస్తారు కదా. నాగార్జున గారు వింటున్నారా సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయిస్తే ఓకే. నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ గా ఉంటుంది.

ఆయన్ని చూడగానే ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని చూసా కానీ దగ్గరకు వెళ్లి ఎప్పుడూ మాట్లాడలేదు. బిగ్ బాస్ ఆఫర్ వస్తే ముందు వెళ్లి నాగార్జున గారికి ముద్దు పెట్టేసి ఆ తర్వాత మాట్లాడతా. రీసెంట్ గా కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు షోస్ కి ఎవరూ రావడం లేదు అని అడిగితె బిగ్ బాస్ చూస్తున్నారు అని చెప్పారు. పల్లెటూళ్లలో కూడా ప్రతీ ఒక్కరూ బిగ్ బాస్ చూస్తున్నారు. ప్రతీ నార్మల్ పీపుల్ కి ఈ షో రీచ్ అవుతుంది. పెద్ద స్క్రీన్ మాత్రమే కాదు చిన్న స్క్రీన్ మీద కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. నాకు వంట రాదు..ఎవరో ఒకరు చేసి ఇస్తారు ఐనా జ్యూస్ లు ఏర్పాటు చేస్తే చాలు. బాత్ రూమ్స్ క్లీనింగ్ అవన్నీ క్లీన్ చేస్తామా ఏంటి..ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేనే కొట్టేస్తా...దాంతో వాళ్ళు నా జోలికి రారు. వాళ్ళే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. తర్వాత రాజ్యం మొత్తం మనమే ఏలేది." అంటూ చెప్పుకొచ్చింది గీతా సింగ్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.