English | Telugu

గుప్పెడంత మ‌న‌సు` : జ‌గ‌తిని రిషీ ఏమ‌డిగాడు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. రిషీ. వసుల ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఆద్యంతం ఆక‌ట్టుకునే క‌థా క‌థ‌నాల‌తో సాగుతోంది. గ‌త కొర‌న్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ ఈ శుక్ర‌వారం 302వ ఎపిసోడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. రిషీ, ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర‌ల‌తో క‌లిసి ఇంట్లో కూర్చుని ` ఈరోజే లాస్ట్ ఎగ్జామ్‌...సెల‌వుల్లో మెషీన్ ఎగ్జామ్ మ‌రింత డ‌బుల్ చేయాలి` అంటాడు. ఇదే స‌మ‌యంలో మ‌హేంద్ర‌కు వ‌సు ఫోన్ చేస్తుంది.

ప‌క్క‌కు వెళ్లిన మ‌హేంద్ర `నేనే నీకు ఫోన్ చేయాల‌నుకుంటున్నాన‌మ్మా .. నీతో చాలా మాట్లాడాలి` అంటాడు అయితే రెస్టారెంట్‌లో సాయంత్రం క‌లుద్దామా` అంటుంది వ‌సు. రిషి వ‌స్తున్నది గ‌మ‌నించి మ‌హేంద్ర ఫోన్ క‌ట్ చేస్తాడు. అది గ‌మ‌నించిన రిషీ.. ఏంమీ త‌న‌తో మీకు ప‌ర్స‌న‌ల్స్‌.. అని ప్ర‌శ్నిస్తే.. అబ్బెబ్బే ఏమీ లేదు ఊరికే చేసింది అని క‌వ‌ర్ చేస్తాడు. మీరు రెస్టారెంట్లో క‌ల‌వాల‌నుకుంటున్నార‌ని అది త‌న‌కు తెలుస‌ని త‌న‌కు తెలుస‌ని రిషి మ‌న‌సులో అనుకుంటాడు.

మ‌రి అనుకున్న‌ట్టుగానే మ‌హేంద్ర‌, వ‌సు రెస్టారెంట్‌లో కలుసుకున్నారా? .. క‌లిస్తే ఏం మాట్లాడుకున్నారు? .. ఆ త‌రువాత ఏంజ‌రిగింది? .. రిషి వ‌చ్చాడా? .. జ‌గ‌తికి .. రిషి.. వ‌సు గురించి ఏం చెప్పాడు? .. అందుకు జ‌గ‌తి ఎలా రియాక్ట్ అయింది? .. వంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ త‌ప్ప‌కుండా చూడాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.