English | Telugu

 రెండు ఇడ్లి 1200 .. పచ్చళ్ళ కంటే కాస్ట్ గా ఉన్నాయి..

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్ తో పాటు ప్రియాంక జైన్, శోభా శెట్టి, సుహాసిని వచ్చారు. ఐతే నిన్న మొన్నటి వరకు రచ్చ చేసిన అలేఖ్య చిట్టి పికిల్స్ కాన్సెప్ట్ ని ఈ షోలో కూడా వాడేశారు. ఐతే సుమ అడ్డా షోలో "సుమ టిఫిన్స్ అండ్ కర్రీ పాయింట్" పేరుతో ఒక స్కిట్ వేశారు. ఇందులో సుమ కూడా మాములుగా జోక్స్ వేయలేదు. "ఈ ఇడ్లీ గనక మీరు తిన్నారు అనుకో మీ ముఖం కూడా ఇడ్లీలా నిగనిగలాడిపోతుంది అంతే. రెండు ఇడ్లి 1200 అమ్మా" అంటూ సుమ మంచి జోష్ తో డైలాగ్ వేసింది.

దానికి అంబటి అర్జున్ వచ్చిన "ఏంటో వీళ్ళ ఇడ్లి పచ్చడి కన్నా కాస్ట్ గా ఉంది..ఆ పచ్చడి కొనలేకే మీ టిఫిన్ తిందామని వచ్చాను..టిఫిన్ కూడా ఇంత కాస్ట్లీ గా చెప్తుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి" అంటూ చిట్టి పికిల్స్ మీద సెటైర్స్ వేసాడు. ఆ తర్వాత సుహాసిని వచ్చి "ఏంటి ఈ దోశ ఇంత గట్టిగా ఉంది" అని అడిగింది. దానికి సుమ " మేము దోశలు వేసేసిన తర్వాత వాటిని డైరెక్ట్ గా తీసుకువెళ్లి గేట్ మీద ఆరేస్తాం" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో స్కిట్ లో ఉన్న ఇంకో కమెడియన్ "అంటే ఎవరో చెప్పారు మన హోటల్ లో దోస తింటే బాగా డాన్స్ వస్తుందట" అన్నాడు. దానికి సుమా "అవును రా అంటూ దోశ, చట్నీ పెట్టింది సుమా. అది తిన్న వెంటనే అతను మైకేల్ జాక్సన్ స్టెప్పులేసి కింద పడిపోయాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఐతే ఈ వారం ప్రతీ స్కిట్ లో కూడా పచ్చళ్ళు కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఈ షోకి రాగానే శోభా శెట్టి, ప్రియాంక జైన్ కలిసి కొబ్బరి మామిడిని ఇలా తినాలి అంటూ ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. దానికి సుమ ఐతే ఈ మధ్య ఏ పనీ తిన్నగా చేయట్లేదా అని సెటైర్ వేసింది. ఇలా ఈ షో మొత్తం సెటైర్స్ కనిపిస్తూనే ఉన్నాయి.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.