English | Telugu

మా నాయనా రైతు...నేను రైతు బిడ్డను..గీతూ కౌంటర్ 


సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి జబర్దస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. పల్లవి ప్రశాంత్, భోలే షావలి, దామిని, గీతూ రాయల్, ఫైమా, కీర్తి భట్ వచ్చారు. సుమ అడ్డాలో ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రం గట్టిగానే గొడవయ్యింది. దాంతో సుమ కూడా షాకయ్యింది. ఇక సుమ ఫస్ట్ రౌండ్ కోసం గెస్టులను కూర్చోబెట్టింది.

ఐతే గీతూ, కీర్తి వచ్చి కూర్చున్నారు. దాంతో "ఫైమా నువ్వు రాలేదేంటి" అని అడిగింది సుమ. కీర్తి, గీతూ అనుకుని వెళ్లిపోయారు అని చెప్పింది. "స్కిట్ చేసేటప్పుడు నన్ను కలుపుకున్నావా" అని గీతూ అడిగింది. దాంతో ఇద్దరి మధ్య గొడవయ్యింది. "గట్టిగా అరవద్దు గీతూ నువ్వు తోపువి అని ఫీల్ కాకుండా వెళ్లి ఆడు" అని గట్టిగా ఇచ్చింది. మధ్యలో బోలె షావలి వచ్చేసరికి "నీ టీమ్ కాదుగా సైలెంట్ గా ఉండు" అంటూ గీతూ వార్నింగ్ ఇచ్చింది. "కీర్తి నువ్వు లే" అని సుమ అనేసరికి అంటే "నన్ను అవమానిస్తున్నారా" అంటూ ఫీలయ్యింది. "షో నుంచి వెళ్లిపొమ్మంటే వెళ్ళిపోతా నాకు అవసరం లేదు" అని చెప్పింది గీతూ. "బాబోయ్ ఏమి ఈగోలు రా నాయనా" అంటూ సుమ తలపట్టుకుంది. పల్లవి ప్రశాంత్ కూడా గీతూ మీద కామెంట్స్ చేసేసరికి "బిగ్ బాస్ లో చేసిన గత్తరంతా ఇక్కడ నా ముందు చేయమాకా.. ఇలాంటి కామెంట్స్ తీసుకోలేకపోతే షోకి ఇంకా రామాకు " అని సీరియస్ గా చెప్పింది గీతూ. ఇక పల్లవి ప్రశాంత్ అదే రాగం అందుకున్నాడు. " మా నాయనా రైతు...నేను రైతు కొడుకును" అన్నాడు. "మా నాయనా కలెక్టర్ అయ్యాడని నేను కలెక్టర్ ని కాలేనుగా" అంటూ కౌంటర్ ఇచ్చింది గీతూ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.