English | Telugu

హిమ చెప్పిన నిజం.. షాకైన సౌంద‌ర్య‌!

గ‌త ఎపిసోడ్ లో జ్వాల‌కు నిజం చెప్పాల‌నే ఉద్దేశ్యంతో నిరుప‌మ్.. జ్వాల‌ని "ప‌ద వెళ‌తాం" అంటూ హిమ ముందే పిలుస్తాడు. జ్వాల సిగ్గుప‌డుతూ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. హిమ కంగారుప‌డుతూ "నేనూ వ‌స్తాను" అని అడ్డుప‌డుతుంది. తీరా జ్వాల.. హిమ‌ని తీసుకుని వెళ్ల‌కుండా నిరుప‌మ్ ని తీసుకుని వెళ్ల‌డంతో క‌థ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరిగింది. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. హిమ క్యాన్స‌ర్ ఓ నాట‌క‌మ‌ని సౌంద‌ర్య‌కు తెలుస్తుంది. ఆ త‌రువాత త‌ను ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం.

హిమ క్యాన్స‌ర్ బారిన ప‌డింది అన్న‌ది ఓ నాట‌క‌మ‌ని సౌంద‌ర్య‌కు తెలుస్తుంది. దీంతో త‌న‌ని పిలిచిన సౌంద‌ర్య లాగిపెట్టి చెంప ఛెళ్లుమ‌నిపిస్తుంది. దీంతో హిమ, ఆనంద‌రావు షాకుకు గుర‌వుతారు. వెంట‌నే తేరుకున్న ఆనంద‌రావు `దాన్ని ఎందుకు కొట్టావు` అంటూ సౌంద‌ర్య‌ని నిల‌దీస్తాడు. వెంట‌నే `అంతా తెలిసిపోయింది హిమా` అని సౌంద‌ర్య అరుస్తుంది. ఆ మాట‌లు విన్న హిమ `నాన‌మ్మా` అంటుంది భ‌యం భ‌యంగా.. అదే స‌మ‌యంలో సౌంద‌ర్య‌.. 'నీకు క్యాన్స‌ర్ లేదు' అని అరుస్తుంది. అక్క‌డే వున్న నిరుప‌మ్‌, స్వ‌ప్న‌, ఆనంద‌రావు షాక్ అవుతారు.

'మా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి ఎందుకీ నాట‌కం?' అంటుంది సౌంద‌ర్య కోపంగా... 'చెబుతావా లేక..' అంటూ మ‌రోసారి హిమ పైకి చేయి లేపుతుంది. వెంట‌నే `శౌర్య ఎవ‌రో ఎక్క‌డుందో నాకు తెలుసు` అంటూ నోరు విప్పుతుంది హిమ‌. ఆ మాట‌ల‌కు సౌంద‌ర్య ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. సౌంద‌ర్య‌ని శౌర్య పేరుతో శోభ‌ బ్లాక్ మెయిల్ చేస్తున్న విష‌యాన్ని గ్ర‌హించిన హిమ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేందుకే సిద్ధ‌ప‌డుతుంది. క‌ట్ చేస్తే.. నిరుప‌మ్, జ్వాల‌తో మాట్లాడుతుంటే సౌంద‌ర్య‌, హిమ వింటారు. ఇదే స‌మ‌యంలో హిమ ఓ నిజం చెబుతుంది. అదేంటీ?.. ఆ నిజం విని సౌంద‌ర్య ఎందుకు షాక్ కు గురైంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.