English | Telugu

Jayam serial : పారుని ఇంట్లోకి తీసుకొచ్చిన శకుంతల.. గంగకి టెన్షన్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -186 లో....రుద్రకి దగ్గరగా ఉండాలని పారు ప్లాన్ చేస్తుంది. పారుని తీసుకొని శకుంతల ఇంటికి వస్తుంది. పారుని జాగ్రత్తగా పట్టుకొని వస్తుంటే ఏమైంది సిస్టర్ పారుని అలా పట్టుకొని వస్తున్నారని ఇందుమతి అడుగుతుంది. తనకి ఒంట్లో బాగోలేదు కళ్ళు తిరిగిపడిపోతే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సెలైన్ కూడా ఎక్కించారు. వాళ్ళ అన్నయ్య ఊళ్ళో లేడు. అందుకే పారుని మన ఇంటికి తీసుకొని వచ్చానని శకుంతల అంటుంది. పారుని తీసుకొని రావడం ఇంట్లో ఎవరికి నచ్చదు.

అది వచ్చింది ఒంట్లో బాలేక కాదు.. నా కాపురంలో చిచ్చు లు పెట్టడానికి అని గంగ అనుకుంటుంది. ప్రమీల జ్యూస్ తీసుకొని రా అని శకుంతల చెప్తుంది. ప్రమీల వెళ్లి శకుంతలకి ఇస్తుంది. తాగు పారు అని శకుంతల జ్యూస్ ఇస్తుంటే.. నీరసంగా ఉన్నాట్లు యాక్టింగ్ చేస్తుంది పారు. దాంతో శకుంతల తాగిపిస్తుంది. బాక్సింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు టైమ్ కి తినాలి ఆరోగ్యంగా ఉండాలని ఇందుమతి భర్త చెప్తాడు. అన్నయ్య ఎప్పుడు బిజీగా ఉంటాడు.. నన్ను ఎవరు చూసుకుంటారు అంకుల్ అని పారు అంటుంది. అందుకేగా నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిందని శకుంతల అంటుంది.

ఆ తర్వాత పారు ఇక్కడ ఎందుకు అత్తయ్య అని ప్రమీల అంటుంది. అవునని గంగ అంటుంది. ఓహ్ నా నిర్ణయానికి ఎదురు చెప్తున్నావన్న మాట అని శకుంతల అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి నీ నిర్ణయానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు.. పారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండనివ్వండి అని రుద్ర చెప్తాడు. ఇక పారు హ్యాపీగా ఉండగా గంగ కుళ్ళుకుంటుంది.
ఆ తర్వాత పారు ఎవరు చూడకుండా కిచెన్ లోకి వెళ్లి అన్నం తింటుంది. అప్పుడే గంగ వాటర్ తాగడానికి కిచెన్ దగ్గరికి వస్తుంది. పారు బిర్యానీ తినడం చూస్తుంది గంగ. తన దగ్గరికి వచ్చిన గంగ.. నీకు ఆరోగ్యం బాలేదు అన్నారు మరి బిర్యానీ లాగిస్తున్నావ్ అగు రుద్ర సర్ వస్తున్నారు కదా చూపిస్తానని గంగ అనగానే త్వరగా పారు తన చేతిలో ఉన్న ప్లేట్ ని గంగ చేతిలో పెడుతుంది. ఆ తర్వాత డ్రామా మొదలెడుతుంది పారు. అయితే ఇక్కడ రుద్ర ముందు గంగని ఇరికిస్తుంది పారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది‌. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది. 

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.