English | Telugu

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ హరీష్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సంజన!

బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం వీకెండ్ వచ్చేసింది. గత రెండు రోజుల నుండి హాట్ టాపిక్ ఏదంటే.. సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ అని, తను హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని అన్నారు. మొదట సీక్రెట్ రూమ్ అన్నారు.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉహించుకున్నారు. కానీ నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రావడంతోనే సంజన స్టేజ్ పైకి వచ్చేసింది. ఇక తను స్టేజ్ మీదకి వచ్చి.. నేను ఎలిమినేట్ అయ్యేంత ఏం తప్పు చేశానని ఎమోషనల్ అవుతుంది.

ఈ స్టేజ్ వదిలి వెళ్లే ముందు నీ హౌస్ మేట్స్ తో మాట్లాడుదామని నాగార్జున అంటాడు. మన టీవీలో అందరిని సంజన చూస్తుంది. అందరి గురించి చెప్పమని నాగర్జున అంటాడు. ఎవరు ఏది మార్చుకోవాలో ఒక్క మాటలో చెప్పమని సంజనని అడుగుతాడు. దాంతో సంజన అందరి గురించి చెప్తుంది. సుమన్ అన్న కన్పించడం లేదు‌‌.. దేనికి స్టాండ్ తీసుకోరు అని సంజన చెప్తుంది. ఇక రాము పై సంజన సీరియస్ అవుతుంది. ఏంట్రా నేను అందరిని చిన్నస్థాయి, పెద్దస్థాయి అని చూస్తానా.. నేను ఎవరినైనా అలా చూసానా.. హరీష్ గారితో ఏదో అంటున్నావ్ చీప్ గా బెహేవ్ చేస్తానని సంజన అనగానే.. నేను అనలేదని రాము అంటాటు. రికార్డు ఉందని సంజన చెప్తుంది.

ఇక హరీష్ గారు నాలుగు రోజుల నుండి ఒకే డ్రెస్ పై ఉన్నారు. హైజీన్ గా లేరని సంజన అంటుంది. తనతో ఏదైనా చెప్దాం అన్నా కూడా అందరు భయపడుతున్నారు. ఏమని చెప్పమంటారు సర్ మా బాధ అని సంజన అంటుంది. ఇక ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు. తనతో ఉంటే మా అమ్మతో ఉన్నట్లే ఉంటుంది సర్ ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. ఇక సంజన అందరికి బై చెప్పి వెళ్లిపోతుంటే.. సంజన ఒక్క నిమిషం అని నాగార్జున వెనక్కి పిలుస్తాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.