English | Telugu

Karthika Deepam2 :  బేబి వద్దని చెప్పమని శౌర్యకి నూరిపోసిన పారిజాతం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -531 లో.. ఇంకా పని వాళ్ళు రాలేదని పారిజాతం గుమ్మం దగ్గర ఉండి తిట్టుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఎందుకు లేట్ అయిందో కారణం ఉంటుందని అంటాడు. అదేదో చెప్పాలి కదా ఇంత వరకు కాఫీ తాగలేదని పారిజాతం అంటుంది. కార్తీక్ కి శివన్నారాయణ ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చెయ్యడు.‌ దాంతో కాంచనకి ఫోన్ చేస్తాడు. కార్తీక్ ఇంకా లేవలేదు నాన్న.. రాత్రి దీపకి కడుపు నొప్పి అని ఇబ్బంది పడిందని చెప్తుంది.

ఆ తర్వాత శివన్నారాయణ వెళ్లి సుమిత్రని తీసుకొని రా అని పారిజాతానికి చెప్తాడు. ఆ తర్వాత అనసూయ దగ్గర శౌర్య జుట్టు వేసుకోకుండా మారాం చేస్తుంటుంది. దాంతో కాంచన వేస్తుంది. దీని అల్లరి తట్టుకోలేకపోతున్నాం.. ఎక్కడికైనా పంపించు అక్క అని అనసూయ అంటుంది. రాత్రి పారిజాతం అన్నమాటలు గుర్తుచేసుకొని.. రాత్రి మా పిన్ని ఫోన్ చేసిందని అనసూయకి కాంచన చెప్పబోతుంటే. పారిజాతం, శివన్నారాయణ, సుమిత్ర డాక్టర్ ఇంటికి వస్తారు. అప్పుడే కార్తీక్ నిద్ర లేచి హాల్లోకి వస్తాడు. అక్కడ డాక్టర్, శివన్నారాయణ ఉంటారు. డాక్టర్ ఏంటి తాత అని శివన్నారాయణ అడుగుతాడు. రాత్రి దీపకి కడుపునొప్పి అంట కదా అందుకే తీసుకొని వచ్చానని శివన్నారాయణ అంటాడు.

డాక్టర్ సుమిత్ర, పారిజాతం ముగ్గురు దీప దగ్గరికి వెళ్తారు. మళ్ళీ పారిజాతాన్ని డాక్టర్ బయటకు పంపిస్తుంది. ఎందుకు కడుపు నొప్పి లేసిందని అడుగగా.. శౌర్య కాలుతో తన్నిందని దీప చెప్తుంది. అదే విషయం డాక్టర్ బయటకు వచ్చి చెప్తుంది. నాకు తెలుసు అందుకే అక్కడ పడుకోకు అని చెప్పానని కాంచన అంటుంది. ఇక మీదట జాగ్రత్తగా ఉండమని దీపకి డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత శౌర్య దగ్గరికి పారిజాతం వచ్చి.. నీకు చిన్న చెల్లి వస్తుంది. ఇక అందరి ప్రేమ తనపై ఉంటుంది. నిన్ను పట్టించుకోరు. నువు ఏం చెయ్యాలంటే ప్రతీదానికి అల్లరి చెయ్యాలి. బేబీ వద్దని చెప్పాలని పారిజాతం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.