English | Telugu

మణికంఠ ముంచేసింది వీళ్లనే.!


బిగ్ బాస్ సీజన్-8(bigg boss 8 telugu) లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంటెంట్ ఇచ్చింది మణికంఠే. ఓసారి ఇంటలిజెన్స్ చూపిస్తాడు. మరోసారి కన్నింగ్, మరోసారి లవ్, మరోసారి సింపథీ.. ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ని ఒకేసారి చూపించే నాగ మణికంఠ(Naga Manikanta ) నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు.

కొన్ని కటౌట్ లు చూస్తే చాలు.. వాళ్ళేంటో అర్థమవుతుంది కానీ ఎవరికి అర్థం కానీ క్యారెక్టర్ బిగ్ బాస్ సీజన్-8(bigg boss 8 telugu) లో ఎవరైనా ఉన్నారంటే అది నాగ మణికంఠే... హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తనదైన శైలీలో ఆడుతూ వచ్చాడు మణికంఠ‌(Manikanta). బయట ఓటింగ్ కూడా చాలా గట్టిగానే ఉంది‌. అయితే ప్రతీవారం నామినేషన్ లో ఉన్న మణికంఠ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండేవాడు. ఈ వారం కూడా అతను టాప్ లోనే ఉన్నాడు కానీ అతనికి ఆడాలని ఉన్నా, హెల్త్ సపోర్ట్ చేయకపోవడంతో ఉండలేనని చెప్పేసాడు మణికంఠ. ఇక ఏడో వారం నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరగా నాగ మణికంఠ, గౌతమ్ మిగిలారు. ఇక ఎలిమినేషన్ ముందు నాగార్జున హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకున్నాడు. అందరు మణికంఠ వెళ్తేనే బాగుంటుందని అన్నారు. అదే విషయం చెప్తూ మణికంఠని అడుగగా.. నేను బిగ్ బాస్ ( bigg boss 8 telugu) హౌస్ లో ఉండను సర్.‌. నా వల్ల అవ్వడం లేదంటు మణికంఠ చెప్పడంతో మణికంఠ ఈజ్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పేశాడు. నిజానికి గౌతమ్ ఎలిమినేషన్ అవ్వాలి .. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం గౌతమ్ ఈజ్ ఎలిమినేటెట్ అని నాగార్జున చెప్పాడు. దాంతో గౌతమ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు.

ఇక బిగ్ బాస్ (bigg boss 8 telugu) హౌస్ లోని హౌస్ మేట్స్ అందరికి బై బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన నాగ మణికంఠ తన ప్రాబ్లమ్ చెప్పుకున్నాడు. ఇక హౌస్ లో ఎవరుండాలి.. ఎవరు మారాలంటూ.. ఓ షిప్ తీసుకొచ్చి.. ఎవరిని ముంచేస్తావ్.. ఎవరని షిప్ ఎక్కిస్తావ్ అని అడిగాడు నాగార్జున. ఇక గౌతమ్, పృథ్వీ, నిఖిల్, టేస్టీ తేజని ముంచేశాడు మణికంఠ. విష్ణుప్రియ, హరితేజ, నయని పావని, నబీల్, అవినాష్, రోహిణి, మెహబూబ్ లని షిప్ మీద పెట్టాడు. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్తూ మణికంఠ ఎమోషనల్ అయ్యాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.