English | Telugu

'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రెడీ అన్న ఆర్పీ

జబర్దస్త్ కమెడియన్ గా కిర్రాక్ ఆర్పీ ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఐతే తర్వాత షో నుంచి నాగబాబు వెళ్లిపోయేసరికి ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక మూవీ తియ్యడానికి ట్రై చేసాడు కానీ దాని డీటెయిల్స్ ఏమీ తెలీదు.

ఇక జబర్దస్త్ గురించి సోషల్ మీడియాలో ఆర్పీకి మిగతా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ కి బాగా గొడవలు కూడా జరిగాయి. అలా ఆర్పీ టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసి కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. ఎక్కడా స్థిరంగా ఉండని ఆర్పీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలో "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో రీసెంట్ గా ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ.

ఈ నెల్లూరు పెద్దారెడ్డి రెస్టారెంట్ ప్రత్యేకతల గురించి ఆర్పీ మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ లో అన్ని వంటకాలు కట్టెల పొయ్యి పైనే వండుతామని.. పదేళ్ల కిందటే మొదలు పెడదామనుకున్న రెస్టారెంట్ కల ఇప్పటికి నెరవేరిందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ ఊరు నెల్లూరు అని తెలిసిన విషయమే. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రుచిని హైదరాబాద్ వాసులకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినట్లు చెప్పాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.