English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్న రూమ్ లో సీక్రెట్ కెమెరా.. కాశీతో కలిసి ఆమె ఆడే ఆటలు కార్తీక్ కనిపెడతాడా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -552 లో... కార్తీక్ దగ్గరకు రాత్రి స్వప్న ఏడుస్తూ వస్తుంది. ఇంత రాత్రి ఎందుకు వచ్చావని కార్తీక్ కోప్పడతాడు. కాశీకి జాబ్ వచ్చిందని జరిగింది మొత్తం చెప్తుంది. నాన్న అరెస్ట్ కి కాశీకి ఏదో సంబంధం ఉందని అర్థం అవుతుందని స్వప్న అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. అవన్నీ ఏం పట్టించుకోకు.. నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్తాడు. కాసేపటికి స్వప్నని కార్తీక్ వెంటతీసుకొని ఇంటికి వెళ్తాడు.

ఆ తర్వాత కార్తీక్ తో స్వప్న మాట్లాడుతుంటే.. కాశీ ఎంట్రీ ఇస్తాడు. జాబ్ వచ్చిందట చెప్పలేదని కార్తీక్ అడుగుతాడు. జాయిన్ అయ్యాక చెప్దాననుకున్న బావ అని కాశీ అంటాడు. మీ మావయ్యకి చెప్పవా అని కార్తీక్ అనగానే ఎలా చెప్పాలి.. స్టేషన్ లో ఉన్నాడు కదా అని కాశీ అనగానే.. వస్తాడు నువ్వు వెళ్ళేలోపు నీకు సెండాఫ్ ఇవ్వడానికి ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు అంటే నాకు అసలు ఇదంతా ఎవరు చేసారో తెలిసింది. అన్ని బయటకు రప్పిస్తానని కార్తీక్ అనగానే కాశీ టెన్షన్ పడతాడు. ఇదంతా ఎవరు చేసారో తెలిస్తే అసలు వదులొద్దు అన్నయ్య అని స్వప్న అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళకి కాశీ పైన డౌట్ వస్తుంది. అసలు ఇదంతా వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారో కనుక్కోవాలనుకుంటారు.

మరొకవైపు ఇదంతా కాశీతో నేనే దగ్గర ఉండి చేయించానని పారిజాతంతో జ్యోత్స్న చెప్పగానే పారిజాతం భయపడుతుంది. కానీ కాశీతో జ్యోత్స్న ఫోన్ లో మాట్లాడగానే పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ ఏం జరగనట్లు వచ్చి.. ఇంట్లో పనులు చేసుకుంటాడు. జ్యోత్స్నకి డౌట్ వస్తుంది. మరొక వైపు జ్యోత్స్న ఉండే ప్లేస్ లో దీప ఫోన్ కెమెరా ఆన్ చేసి పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.