English | Telugu

Karthika Deepam2 : స్పృహ తప్పి పడిపోయిన శివన్నారాయణ.. సుమిత్ర ఆచూకి తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -490 లో..... కార్తీక్, దశరథ్ ఇద్దరు సుమిత్రని వెతకడానికి వెళ్తారు. కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. అప్పుడే శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. అక్కడికి వస్తే కాల్ చెయ్యమని చెప్తాడు. సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం కాంచనకి శ్రీధర్ చెప్తాడు. దాంతో కాంచన షాక్ అవుతుంది.

మరొకవైపు సుమిత్ర గురించి దీప ఒకవైపు కార్తీక్, దశరథ్ ఇద్దరు ఒకవైపు వెతుకుతుంటారు. సుమిత్రని గుర్తుచేసుకొని దశరథ్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ కి జ్యోత్స్న ఫోన్ చేసి తాతయ్య స్పృహ తప్పి పడిపోయాడని చెప్తుంది. దాంతో కార్తీక్, దశరథ్ ఇద్దరు ఇంటికి వెళ్తారు. డాక్టర్ వస్తాడు. అయన ఏదో టెన్షన్ పెట్టుకున్నాడు.. అది దూరం చెయ్యమని డాక్టర్ చెప్తాడు. మరొకవైపు దీప ఒక అమ్మవారి గుడి దగ్గర ఆగుతుంది. తన బాధని చెప్పుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే పంతులు వచ్చి దీపకి ధైర్యం వచ్చేలా మాట్లాడతాడు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ఆ బాధ తొలగిపోతుంది దైర్యంగా వెళ్ళమని దీపతో పంతులు చెప్తాడు.

శివన్నారాయణ దగ్గరికి కాంచన, శ్రీధర్ వస్తారు. తన తండ్రిని ఆ పరిస్థితిలో చూసి కాంచన ఏడుస్తుంది. అసలు మీ అమ్మ వెళ్తుంటే ఆపకుండా ఏం చేసావని జ్యోత్స్నని పారిజాతాన్ని కాంచన తిడుతుంది. శివన్నారాయణ స్పృహలోకి వచ్చి సుమిత్ర ఎక్కడ అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.