English | Telugu

Karthika Deepam2 : అడిటర్ ని  కొనేసిన జ్యోత్స్న.. మెచ్చుకున్న శివన్నారాయణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -283 లో.....జ్యోత్స్న మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. అప్పుడే దశరథ్ వచ్చి ఎన్ని అబద్ధాలు ఆడుతావ్ జ్యోత్స్న.. ఇలా అన్ని తప్పు మీద తప్పు చేస్తునే ఉంటావా అని దశరత్ అడుగుతాడు. డాడ్ ఏ విషయం గురించి ఇలా మాట్లాడుతున్నావని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు దేని గురించి అనుకుంటున్నావు చెప్పు అంటు జ్యోత్స్నని దశరథ్ కన్ఫ్యూషన్ చేస్తుంటాడు. నువ్వు అడిట్ లో ఏదో తప్పు అంటున్నావని దశరథ్ అంటాడు. దాస్ గురించి కాదని జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. నాకు నిన్ను డైరెక్ట్ అడగాలని ఉంది కానీ దాస్ నిజం చెప్పకుండా నిన్నేం అడగలేనని దశరథ్ అనుకుంటాడు.

మరొకవైపు టిఫిన్ సెంటర్ పెట్టడానికి దీప ఒక బండి తీసుకొని క్లీన్ చేస్తుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. నాకూ చెప్పకుండా బండి తీసుకున్నారా.. నాకు ఒక మాట కూడా చెప్పలేదని కార్తీక్ అంటాడు. అదేం లేదు ఇక మీరు ఇక్కడికి రావద్దంటూ కార్తీక్ చెయ్ తీసి శౌర్య మీద వేస్తుంది. దాంతో కార్తీక్ కోపం గా లోపలికి వెళ్తాడు. వాడికి అర్ధమయ్యేలా చెప్పాలి కానీ అలా చెయ్యడం ఏంటని కాంచన అంటుంది. దీప లోపలికి వెళ్లి కార్తీక్ తో మాట్లాడుతుంది. మీరు ఇడ్లీ బండి దగ్గరే ఆగిపోవద్దు. అందుకే మీరు అక్కడికి రావద్దు.. అదంతా నేను చూసుకుంటాను.. మీ తాతయ్యకి మీ నాన్నకి సవాలు విసిరారని కార్తీక్ కి దీప అర్థయ్యేలా చెప్తుంది. మరొకవైపు పారిజాతం పంతులుని పిలిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు అని జ్యోత్స్న అడుగగా... దాస్ గురించి, వాడు బాగోలేడు కదా హోమం జరిపిద్దామని పారిజాతం అంటుంది. ఇప్పుడు అవసరమా.. బాగై ఏం చేస్తాడని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దశరథ్ వచ్చి దాస్ బాగవ్వాలని నీకు లేదా అని సెటైర్ వేస్తాడు. నాకు ఎందుకుండదంటూ జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. పిన్ని మంచి ముహూర్తం చూసి హోమం చేపించు.. దాస్ బాగుండాలని దశరథ్ అంటాడు.

అప్పుడే శివన్నారాయణ వచ్చి.. ఇప్పుడే అడిటర్ ఫోన్ చేసాడు. రెస్టారెంట్ లాభంలో ఉందట, కీప్ ఇట్ అప్ జ్యోత్స్న అని శివన్నారాయణ మెచ్చుకుంటాడు. అదేంటి మొన్న లాస్ లో ఉంది కదా అంటే అడిటర్ ని కూడా జ్యోత్స్న కొనేసినట్లుందని దశరథ్ అనుకుంటాడు. చూసారా ఆ కార్తీక్ కంటే నా మనవరాలు గ్రేట్ అని పారిజాతం అంటుంటే.. వాడితో నా మనవరాలిని పోల్చడమేంటని పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. మరుసటి రోజు దీప ప్రొద్దునే తులసి పూజ చేస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇద్దరు కలిసి దీపం పెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.