English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్.. కార్తీక్ వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈసీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -248 లో..... సుమిత్ర తెచ్చిన టిఫిన్స్ అందరు బాగున్నాయంటూ మెచ్చుకుంటారు. అవి దీప చేసిన టిఫిన్స్ అని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ మనిషే పడదంటే తను చేసిన టిఫిన్ ఎలా తింటారనుకున్నావని శివన్నారాయణ వెళ్లిపోతాడు. ఎందుకు తీసుకొని వచ్చావంటూ దశరథ్ అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పటివరకు చాలా బాగున్నాయన్నారు కదా అంటే.. దీప చేత రెస్టారెంట్ పెట్టిస్తావా అని జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది.

మమ్నీ నువ్వు వెళ్లి దీప టిఫిన్స్ తేవడం ఏంటి.. ప్రొద్దున దాస్ వచ్చాడు. మమ్మీని కలిసాడు అంటే దీప గురించి ఏమైనా చెప్పి ఉంటాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు ఈ రోజు సుమిత్ర గారు వచ్చారు కదా అని కార్తీక్ ని దీప అడుగుతుంది. ఇంతవరకు వచ్చి ఎందుకు రాలేదని దీప బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం దీప, కార్తీక్ లు టిఫిన్ చేస్తుంటే.. ఫుడ్ ఆఫీసర్స్ వచ్చి మీ టిఫిన్ సెంటర్ పై కంప్లైంట్ ఇచ్చారు. మేము చెక్ చెయ్యాలి ఏదైనా తేడా వస్తే సీజ్ చేస్తామని అంటారు. అప్పుడే ఒకతను వస్తాడు. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్తాడు. వాళ్లు వినకపోవడంతో నేను రిటైర్ కలెక్టర్ అని చెప్పగానే వాళ్లు సారీ సర్ అంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అతనికి దీప, కార్తీక్ లు థాంక్స్ చెప్తారు. ఛ ఈ ప్లాన్ కూడా మిస్ అయిందని జ్యోత్స్న అక్కడ నుండి వెళ్లిపోతుంటే.. కార్తీక్ చూసి ఇదంతా జ్యోత్స్న పనా అని అనుకుంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న ఆఫీస్ కి వెళ్లి డిస్సపాయింట్ అవుతుంటే.. అప్పుడే మేనేజర్ వచ్చి జీతాలు అంటాడు. ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొని రా అందరిని జాబ్ లో నుండి తీసేస్తా అంటుంది. ఆ తర్వాత కార్తీక్ భోజనం చేస్తుంటే జ్యోత్స్న రెస్టారెంట్ నుండి కొంతమంది వస్తారు. సర్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళని జాబ్ నుండి తీసేసారు. ఇప్పుడు మా పరిస్థితేంటి అంటూ బాధపడుతుంటే.. మీ హక్కు కోసం మీరు పోరాడండి.. రేపు వెళ్లి మాట్లాడుదామని కార్తీక్ వాళ్ళకి మాటిస్తాడు. ఆ తర్వాత నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని దీపని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.