English | Telugu

అనసూయకి నిజం చెప్పేసిన  కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -135 లో.... శౌర్య కోసం టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది అనసూయ. ఈ టాబ్లెట్స్ చిన్న పిల్లల గుండె సమస్యలు ఉంటే వాడుతారని చెప్పారు. శౌర్యకి ఏం సమస్య ఉందని ఆలోచిస్తూ అనసూయ వస్తుంటే.. అప్పుడే నర్సింహా ఎదరుపడతాడు. నీ కోసమే వస్తున్నాను.. నువ్వే వస్తున్నావని నర్సింహా అంటాడు. మనం ఊరు వెళ్లి, ఇల్లు అమ్మాలి నీకు రెండు లక్షలు ఇస్తాను. మిగతా డబ్బులు ఆ శోభ మోహన కొడతానని నర్సింహా అనగానే.. అది దీప ఇల్లు దానికే హక్కు ఉంటుంది. దాని జోలికి రాకని నర్సింహాకీ అనసూయ వార్నింగ్ ఇస్తుంది.

అప్పుడే కార్తీక్ వచ్చి‌.మ నీకు సిగ్గు అనేదే లేదా అంటూ కోప్పడతాడు. మా మధ్య నువ్వేంటి అంటూ నర్సింహా అంటాడు. మీరు ఎవర్ని చూసుకొని ఇలా చేస్తున్నారో అర్థం అయింది. ఇల్లు ఎలా నా సొంతం చేసుకుంటానో చూడు అంటూ నరసింహా వెళ్ళిపోతాడు. ఈ టాబ్లెట్స్ తీసుకోవడానికి వెళ్ళారా అని కార్తీక్ అడుగుతాడు. ఈ టాబ్లెట్ ఎందుకు వాడుతారు బాబు నిజం చెప్పండి అని అనసూయ అడుగుతుంది. నరసింహకు భయపడి శౌర్య కళ్ళు తిరిగి పడిపోతే.. హాస్పిటల్ లో డాక్టర్ శౌర్య గుండె వీక్ ఉందని చెప్పారని అనగానే అనసూయ షాక్ అవుతుంది. దీనికి పరిష్కారం మందులు వాడడమేనని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్వప్న, కాశీలు స్కూటీ పై సరదాగా వెళ్తుంటారు. మన విషయం మీ ఇంట్లో తెలిసింది కదా అని కాశీ అంటాడు. మా అమ్మకి తెలిసిందని స్వప్న అంటుంది. ఇక ఎప్పుడో మీ నాన్నకి కూడా తెలుస్తుందని కాశీ అంటాడు. అప్పుడే స్వప్న, కాశీలని శ్రీధర్ చూస్తాడు.

ఆ తర్వాత అనసూయని తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. మీరు ఈ విషయం దీపకి చెప్పకండి.. శౌర్యని చూసుకునే బ్రతుకుతుందని కార్తీక్ అంటాడు. మీకు దీప ఏమవుతుందని ఇంత అభిమానం చూపిస్తున్నారని అనసూయ అడుగుతుంది. నాకు శౌర్యని చూస్తే ఏదో తెలియని హ్యాపీ.. తన కోసమే ఇదంతా.. తనకి ఎప్పుడు తోడుగా ఉంటానని కార్తీక్ అంటాడు. ఈ విషయం దీపకి చెప్పకండి అని కార్తీక్ అనగానే.. అప్పుడే దీప వచ్చి ఏ విషయమని అడుగుతుంది. దార్లో నరసింహ కలిసాడు.. ఇల్లు కావాలట అని చెప్తుంది. మీరు రేపు ఊరు వెళ్లి.. వెంటనే ఆ ఇల్లు దీప పేరున చెయ్యండి అని కార్తీక్ అనగానే.. అనసూయ సరే అంటుంది. ఆ తర్వాత శౌర్యతో కార్తీక్ సరదాగా మాట్లాడతాడు. అదంతా పై నుండి జ్యోత్స్న చూస్తుంటుంది.. సుమిత్ర దగ్గరికి కార్తీక్ వస్తాడు. మంచి సలహా ఇచ్చావ్ దీపకీ అని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఇండైరెక్ట్ గా దీప గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత రేపు త్వరగా రండి అని సుమిత్ర కార్తీక్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.