English | Telugu

Karthika Deepam 2 : గౌతమ్ ని రెచ్చగొట్టిన జ్యోత్స్న.. ఏకమైన కార్తీక్, దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -324 లో... కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను మీ ప్రాణాలు కాపాడితే మీరు నా జీవితాన్ని కాపాడారు.. ఈ గడ్డి మొక్కను తులసి మొక్కను చేశారు. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ అనేవారు.. మనిషి ఎప్పుడూ ఒంటరి వాడు కాదు.. పంచభూతాలు మనతో ఉండి మనల్ని నడిపిస్తాయని.. నేను మిమ్మల్ని ఎన్ని మాటలన్నా భూదేవిలా ఓర్చుకున్నారు.. సమస్యల్లో చిక్కున్నప్పుడు ఆకాశంలా నిలబడ్డారు. ఈ తాళిని నా మెడలో కట్టి మైలపడిన గుడిని గంగాజలంతో కడిగేసినట్లు నా బతుకుని శుద్ధి చేశారు. నా గుడిలో మీరు చేరి, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు.. దీపగానే మిగిలిపోయిన నా జీవితాన్ని దీపంగా వెలిగించి.. మీ పేరు పక్కన చోటు ఇచ్చి నన్ను ‘కార్తీకదీపం’ చేశారు అని దీప అంటుంది. ఇంకో జన్మ ఉందో లేదో నాకు తెలియదు. మనం మాత్రం భార్యభర్తలుగా ఉన్నంత వరకు కలిసే ఉంటాం దీపా.. నా నుంచి వెళ్లిపోతా అని ఎప్పుడూ అనొద్దంటాడు కార్తీక్.

దీప చేతుల్ని పట్టుకుని.. ప్రాణాలు కాపాడిన నీ చేతుల్ని ప్రాణం ఉండగా దూరం చేసుకోలేనని కార్తీక్ అనగానే.. దీప మురిసిపోతుంది. నువ్వు నేను అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వద్దు దీపా.. మనిద్దరం ఒక్కటే.. మనది ఆ దేవుడు ముడి వేసిన బంధం.. అందుకే ఈ కోనేటిలో మునిగిపోకుండా నిన్ను పంపాడని కార్తీక్ అంటాడు. ఇక ఏది ఎదురయినా కలిసి పోరాడుదాం.. గెలుద్దామని దీపతో కార్తీక్ అంటాడు.

ఇదిగో దీపా నీ లాకెట్ మళ్లీ నీ దగ్గరకే వచ్చేసింది. దీన్ని నీ దగ్గరే ఉండనీ అంటాడు కార్తీక్. వెంటనే దీప చేయి చాపుతుంది ఇవ్వమని. వెంటనే కార్తీక్.. ఇన్నేళ్లు కష్టపడి దాచింది చేతికి ఇవ్వడానికి కాదు.. మెడలో వేయడానికి.. ప్రాణదాత నా భార్యవు కాకపోయి ఉంటే చేతికే ఇచ్చేవాడ్ని.. ఇక సర్వం నువ్వే.. సర్వస్వం నువ్వే.. మూడు ముళ్లు ఎలాగో నీకు ఎదురుపడి వేయలేదు కదా? కనీసం ఈ లాకెట్ అయిన నీకు ఎదురుగా నిలబడి వేస్తానంటూ మెడలో తాళి కట్టినట్లే లాకెట్ వేస్తాడు కార్తీక్. దీప మురిసిపోతూ కార్తీక్ కళ్ళల్లోకి చూస్తుంది. ఇది నీ మెడలోనే ఉండనీ దీపా అని కార్తీక్ అంటాడు. అయితే దీప కూల్‌గా.. లేదు బాబు ఇది అంటే శౌర్యకు చాలా ఇష్టం.. దానికే ఇస్తాను.. గుర్తుగా ఉంటుంది. ఈ లాకెట్ మా అమ్మది.. మా నాన్న మా అమ్మ గుర్తుగా ఉండాలని దీన్ని నా మెడలో వేశారని దీప అంటుంది.

మరొక వైపు జ్యోత్స్న గౌతమ్ లు కలుస్తారు. జ్యోత్స్న తనని అడ్డు పెట్టుకొని దీప మీద గెలవాలని చూస్తుంది. నీపై అంత నింద వేసింది.. అది నేను నమ్మనంటూ దీపపై కోపం వచ్చేలా గౌతమ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.