English | Telugu

Karthika Deepam 2 : జ్యోత్స్న గ్రిప్ లోకి శివన్నారాయణ‌.. ఇక కార్తీక్, దీపలకి కష్టాలే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -222 లో.. జ్యోత్స్న త్వరగా కోలుకుంటుందని శివన్నారాయణ‌ స్వార్థంగా అలోచించి.. కార్తీక్ కాంచనలని తన ఇంటికి రమ్మని అడుగుతాడు. దీప, శౌర్యలని వద్దని అంటాడు. నా భార్య దీప, నా కూతురు శౌర్య అని దీప భుజంపై చెయ్యి వేసి మాట్లాడతాడు కార్తీక్. వాళ్ళను వదిలి పెట్టి రానని కార్తీక్ అనగానే.. దాంతో శివన్నారాయణ కోప్పడతాడు. నేను ఒక మెట్టు దిగి వచ్చాను.. అలా అని ఇలా పొగరుగా మాట్లాడుతున్నావని అంటాడు.

నువ్వేమంటావని శివన్నారాయణ కాంచనని అడుగగా.. నా కోడలు వాళ్లు వస్తేనే వస్తానంటుంది. అవసరమైతే మీరే మా ఇంటికి రండి అనగానే.. దీపపై శివన్నారాయణ కోప్పడతాడు. ఇంకొకసారి ఇక్కడికి రానని వెళ్ళిపోతాడు శివన్నారాయణ‌. ఎందుకు అలా మాట్లాడారని కాంచనతో దీప అంటుంది. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళందరు దీప గ్రిప్ లో ఉన్నారని దీప గురించి నెగెటివ్ గా పారిజాతం, జ్యోత్స్న మాట్లాడతారు. నేను వాళ్లకి బుద్ది చెప్పాలనుకుంటున్నానని శివన్నారాయణని జ్యోత్స్న అడుగగా.. నీ ఇష్టమని శివన్నారాయణ‌ అంటాడు. ఆ తర్వాత ఇక దీప సంగతి చెప్తాను. బావ, దీపలని వేరు చేయాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది.

మరొకవైపు స్వప్న, కాశీలు కలిసి దీప, కార్తీక్ ల పేరు మీద ఫుడ్ కోర్ట్ పెట్టాలని అనుకుంటారు. ఆ తర్వాత దాస్ దగ్గరికి కాశీ వెళ్తాడు. నువ్వు వెతకాలనుకున్న అతను దొరికాడా అని అడుగుతాడు. కాశీకి అర్థం కాకుండా దాస్ మాట్లాడతాడు. మరొకవైపు దీప బాధపడుతుంటే కార్తీక్ వస్తాడు. ఎందుకు బాబు.. మీ తాతయ్య గారితో కలిసే ఛాన్స్ వస్తే ఇలా చేసారని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.