English | Telugu

Karthika Deepam2 : దీప సాంపిల్స్ మ్యాచ్ అవుతాయా.. ఇంటికెళ్ళిన కాశీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -580 లో.....జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. నా కొడుకు కన్పించడం లేదు.. నాకేదో భయంగా ఉందని పారిజాతం అంటుంది. అప్పుడే రౌడీ ఫోన్ నుండి దాస్ ఫోన్ చేస్తాడు.. ఎవరని పారిజాతం అడుగుతుంది నా ఫ్రెండ్ అని జ్యోత్స్న చెప్పగానే పారిజాతం వెళ్ళిపోతుంది. జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మీ చెంచా గాళ్ళు అనుకుటుంటే విన్నాను.. నీ ప్లాన్ ఫెయిల్ అయిందట కదా.. నీ పతనం ఆరంభం అయింది జ్యోత్స్న అని దాస్ హెచ్చరిస్తాడు. దాంతో జ్యోత్స్నకి భయమేస్తుంది.

మరొకవైపు దీప, కార్తీక్ హాస్పిటల్ కకి వెళ్తారు. డాక్టర్ నాకు టెస్ట్ చేసి సాంపిల్స్ తీసుకోండి మ్యాచ్ అవుతాయని దీప చెప్పగానే మీవేలా మ్యాచ్ అవుతాయి. మీకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని సుమిత్ర చెప్పిందని డాక్టర్ అంటుంది. మ్యాచ్ అవుతాయి ఒకసారి ట్రై చెయ్యండి అని కార్తీక్ అంటాడు. నాకేం అర్థం కావడం లేదు.. ఎలా మ్యాచ్ అవుతాయి.. ఇలా ప్రతీవారిని టెస్ట్ చేసుకుంటూ పోతే టైమ్ వెస్ట్ అవుతుందని డాక్టర్ అంటుంది. అయినా వినకుండా కార్తీక్, దీప రిక్వెస్ట్ చేస్తారు. దాంతో డాక్టర్ సరే అంటుంది. మరొకవైపు కాంచన గుడికి వెళ్తుంది. అక్కడ కాశీ కన్పిస్తాడు. కాశీ అవతారం చూసి కాంచన బాధపడుతుంది.

ఏంట్రా ఇలా అయ్యావని కాంచన అడుగుతుంది. నాకు జీవితమే పోయింది అత్త అని కాశీ ఏడుస్తాడు. కాశీ ఎమోషనల్ అవుతుంటే కాంచన ఏడుస్తుంది. నేను తప్పు చేశాను అత్త అని కాశీ అంటాడు‌. నువ్వు ముందు ఇంటికి పదా అని కాంచన అంటుంది. నన్ను స్వప్నని నువ్వే కలుపు అత్త అని కాశీ అంటాడు. సరే అని కాంచన తన వెంట కాశీని తీసుకొని వెళ్తుంది. మరొకవైపు పారిజాతం, కార్తీక్ మాట్లాడుకుంటారు. మొన్న దాస్ మావయ్య ఇంటికి వచ్చినప్పుడు నీతో పాటు నేను కూడా చూసాను.. నాకు ఎందుకో జ్యోత్స్న పై డౌట్ ఉంది. నువ్వు ముందు జ్యోత్స్న దగ్గరికి వెళ్లి నేను చెప్పినట్లు చెప్పు తన మొహంలో క్లియర్ గా తెలుస్తుందని పారిజాతంతో కార్తీక్ అంటాడు. దానికి పారిజాతం సరే అని జ్యోత్స్న దగ్గరికి వెళ్లి.. జ్యోత్స్న పోలీస్ స్టేషన్ కి వస్తావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి.  ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా  నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.