English | Telugu

షాకింగ్.. జబర్దస్త్ కమెడియన్ మృతి.. యాంకర్ సుమ కన్నీటి పర్యంతం!

ప్రముఖ జబర్దస్త్ నటుడు కన్నుమూత
టీవీ పరిశ్రమలో విషాద ఛాయలు
స్టార్ యాంకర్ సుమ కన్నీటి పర్యంతం

తెలుగు బుల్లితెరపై 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'సుమ అడ్డా' వంటి షోల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ కన్నుమూశారు. ఆయన సోమవారం మృతి చెందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోమవారం రాత్రి రాజమండ్రిలోని 'రోడ్డు కం రైల్వే బ్రిడ్జి'పై జరిగిన ప్రమాదంలో బాబీ మృతిచెందారు. బాబీ బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. అతివేగంగా రెండు బైక్‌లు ఢీకొనడం, హెల్మెట్లు ధరించకపోవడంతో.. ఈ ప్రమాదంలో బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

బాబీ మరణవార్త తెలిసి బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తనతో పాటు సుమ అడ్డా షోకి బాబీ కూడా పని చేశారు. ఆ అనుబంధంతోనే బాబీ మరణవార్త విన్న వెంటనే హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళిన సుమ, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడటంతో సుమ కన్నీటి పర్యంతమయ్యారు.

మాజీ ఎంపీ హర్ష కుమార్ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన బాబీ, నటనపై ఆసక్తితో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమ అడ్డా షోలతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే కమెడియన్ గా ఎదుగుతున్న బాబీ.. 28 ఏళ్ళ వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం.. టీవీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. బుల్లితెరకు చెందిన పలువురు కమెడియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా బాబీకి నివాళులర్పిస్తున్నారు.

Also Read: శ్రీరాముడిగా మహేష్ బాబు.. ఆ 25 నిమిషాలు ఎప్పటికీ మర్చిపోలేరు!

Illu illalu pillalu : అమూల్య నిజం చెప్తుందేమోనని ప్రేమ టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -386 లో.. రామరాజు హాస్పిటల్ లో ఆ సిచువేషన్ లో ఉంటే భాగ్యం, ఆనందరావు ఇద్దరు భోజనం చేస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఆ విశ్వ గాడు ఏదో మాట్లాడుతా అమూల్యని తీసుకొనిరా అన్నందుకు తీసుకొని వెళ్ళాను కానీ వాడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని శ్రీవల్లి కంగారు పడుతుంది. ఏం కాదని భాగ్యం శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తుంటే.. దూరం నుండి నర్మద చూస్తుంది. నర్మద చూసిందని శ్రీవల్లి వెంటనే టేబుల్ కింద దాక్కుంటుంది.

Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసి‌న రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.