English | Telugu

సుడిగాలి సుధీర్ ఇంట్లో రోజూ నాలుగు షోలు.. ఏమాక‌థ‌?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. క‌డుపుబ్బా న‌వ్విస్తూ హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ఆటో రామ్ ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌ను చేస్తున్న‌ స్కిట్ లు హాస్య ప్రియుల్ని అల‌రిస్తున్నాయి. న‌టి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, ప్ర‌ముఖ గాయకుడు మ‌నో ఈ కార్య‌క్ర‌మానికి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అప్పుడ‌ప్పుడు టీమ్ లీడ‌ర్ లు వేసే పంచ్ ల‌కు రోజా, మ‌నో కూడా రివర్స్ పంచు లేస్తూ కామెడీ చేస్తున్నారు. ఈ గురువారం తాజా ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. ఎప్ప‌టి లాగే సుడిగాలి సుధీర్, హైప‌ర్ ఆది ఓ రేంజ్ లో ర‌చ్చ చేయ‌బోతున్నారు.

దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని విడుద‌ల చేశారు. రెట్రో లుక్ కాన్సెప్ట్ తో 80`s గెట‌ప్ ల‌తో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకే క‌ల‌ర్ డ్రెస్సుల్లో క‌నిపించి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్. "అన్న‌య్యా ర‌ష్యాలో త‌ప్పులు చేస్తే శిక్ష‌లు వేరుగా వుంటాయి క‌దా?" అని అడిగాడు హైప‌ర్ ఆది. "అవును.. నీకెలా తెలుసు?" అన్నాడు సుడిగాలి సుధీర్.. "అంద‌రికి గుండు గీస్తే నీకేంటీ మీసాలు గ‌డ్డాలు గీసేశారేంటీ అన్నయ్యా?" అని పంచ్ వేశాడు హైప‌ర్ ఆది.

Also Read:రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

దీనికి నొచ్చుకున్న సుడిగాలి సుధీర్ "అలా అంటావేంట్రా ఇప్ప‌టికే డేట్స్ కుద‌ర‌క నీతో `ఢీ`చేయ‌ట్లేద‌ని ఎంత బాధ‌ప‌డుతున్నానో తెలుసా?" అన్నాడు. "ఆ డేట్స్ లో నువ్వు ఎక్క‌డెక్క‌డ ఢీ కొడుతున్నావో నేనెంత బాధ‌ప‌డుతున్నానో నీకు తెలుసా?" అని హైప‌ర్ ఆది మ‌ళ్ళీ పంచ్ వేశాడు. "నువ్విలా అన్నావంటే `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌.. ఇలా మూడు షోలు మానేస్తా" అన్నాడు సుడిగాలి సుధీర్.. వెంట‌నే "ప్లీజ్ మానేయొద్ద‌న్న‌య్యా.." అన్నాడు హైప‌ర్ ఆది.

అయితే అది విన్న సుధీర్ "ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ వీడికి" అంటూ న‌వ్వేశాడు. ఆ న‌వ్వు ముగిసే లోపే హైప‌ర్ ఆది.. సుడిగాలి సుధీర్‌కు ఫ్యూజులౌట‌య్యే పంచ్ వ‌దిలాడు... "ఈ మూడు షోలు మానేసి ఇంట్లో ఏకంగా రోజుకు నాలుగు షోలు స్టార్ట్ చేస్తావేమో" అని పంచ్ వేసేస‌రికి అక్క‌డున్న వారంతా గొల్లున న‌వ్వేశారు. న‌వ్వులు పూయిస్తున్న ఈ ఎపిసోడ్ వ‌చ్చే గురువారం ప్ర‌సారం కానుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.