English | Telugu

లాస్య చేతిలో అడ్డంగా బుక్కైన తులసి!

తులసి సంగీతం పిల్లల కోసం ఎండ పడకుండా ఉండేందుకు ఒక టెంట్ సిద్ధం చేయడానికి రెడీ అవుతుంది. తులసి నిచ్చెనెక్కి టెంట్ వేయబోతుంది. "మమ్మల్ని పిలిస్తే మేము సాయం చేసేవాళ్ళం కదా" అని ఇంట్లో వాళ్ళు తులసితో అంటారు. ఇంతలో తులసి ఇంటికి బ్యాంకు ఏజెంట్స్ వస్తారు. "మ్యూజిక్ స్కూల్ పెట్టుకోవాలనుకుంటున్నాం" అని వాళ్ళతో చెప్తుంది తులసి. దీని కోసం ఎంత లోన్ వస్తుంది అని అడిగేసరికి "ఎంత కావాలంటే అంత తీసుకోండి" అంటారు. మాకు ఆదాయం ఏమీ లేదు కదా ఎలా ఇస్తారంటాడు పరంధామయ్య.

ఇంతలో తులసి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. అన్ని డాకుమెంట్స్ చెక్ చేసి మళ్ళీ వస్తాం అని చెప్పి బ్యాంకు ఏజెంట్స్ వెళ్ళిపోతారు. 20 లక్షల లోన్ రాగానే అందులోంచి ఫైవ్ లాక్స్ ప్రేమ్ కి ఇవ్వాలి అని అనుకుంటుంది తులసి. ఇంకో వైపు ప్రేమ్ చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు. శృతిని పిలుస్తాడు కానీ మంచి నీళ్లు తేవడానికి వెళ్లి బిందె పట్టుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అది చూసి ప్రేమ్ బిందెని పట్టుకుని ఇంట్లో పెడతాడు.

ఐతే తనకు తక్కువ ఖరీదులో మంచి వాద్య పరికరాలు ఇస్తానని చెప్పాడని చెప్తాడు. కాబట్టి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి డబ్బులు ఏమన్నా అరేంజ్ అయ్యేలా మాట్లాడు అంటూ ఫోన్ ఇస్తాడు ప్రేమ్. శృతికి ఏం చేయాలో తెలియక తులసికి ఫోన్ చేసి వందన అనే పేరుతో మాట్లాడుతుంది. "నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ప్రేమ్ ఆల్బంకి నేను మనీ అరేంజ్ చేస్తాను" అంటుంది తుల‌సి. "బ్యాంకు లోన్ కి అప్లై చేశా, రాగానే ఇస్తాను" అని చెప్పేసరికి శృతికి ఏం మాట్లాడాలో అర్థంకాదు.

మరో వైపు "అంకిత విషయం ఏం చేద్దాం?" అంటూ గాయత్రి అభిని అడుగుతుంది. "మీ మాటే వినట్లేదు నా మాట ఏం వింటుంది?" అంటాడు అభి. తులసి దగ్గర డాకుమెంట్స్ తీసుకున్న బ్యాంకు ఏజెంట్ భాస్కర్.. లాస్య చెప్పినట్టే ఫేక్ డాకుమెంట్స్ క్రియేట్ చేస్తాడు. కానీ చివరికి అవి ఫేక్ అని అంకిత ద్వారా తెలుసుకుని తులసి ఏం చేస్తుంది అనే విషయాలను ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.