English | Telugu

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో మార్పులు...ఈసారి ఆడియన్స్ అభిరుచుకి తగ్గట్టే!

స్టార్ మాలో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో సామ్రాట్ రోల్ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఎందుకంటే సామ్రాట్ క్యారక్టర్ కేవలం తులసికి భజన చేయడం..ఇద్దరి మధ్య రొమాన్స్, పెళ్లి ఇలాంటి విషయాలు మాత్రమే చూపిస్తూండేసరికి ఆడియన్స్ కి అవి ఎక్కడం లేదు...వాళ్లకు పెద్దగా నచ్చలేదు...దాంతో ఈ సీరియల్ రేటింగ్ చాలా డౌన్ అవుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు తన పాత్ర గురించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వస్తూ ఉండడంతో ఆయన ఇంద్రనీల్ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఆడియన్స్ కి నచ్చేలా తన రోల్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్న కారణంగా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే సీరియల్ లోకి మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తానని చెప్పారు. నెక్స్ట్ వీక్ షూటింగ్ షెడ్యూల్‌ ఉందని ఆ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు కథకు మరింత కనెక్ట్ అయ్యేలా స్టోరీలో చాలా చేంజెస్ చేశారని చెప్పుకొచ్చాడు ఇంద్రనీల్ అలియాస్ సామ్రాట్. ఈ సీరియల్ బెంగాలీ వెర్షన్ "శ్రీమోయి"లో హిందీ వెర్షన్ "అనుపమ" లో తులసి క్యారెక్టర్ కి రెండో సారి పెళ్లవుతుంది. కానీ ఇది తెలుగు వెర్షన్. ఇక్కడ ఆడియన్స్ కోరుకున్నప్పుడే ప్రేమ, పెళ్లి జరుగుతుంది. వాళ్లకు క్యారెక్టర్స్ నచ్చాలి లేదంటే ఎంతటి సీరియల్ ని ఐనా వదిలేస్తారు.

ఐతే ఈ ముదురు జంట ప్రేమ కథను ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. "ఇదేం చెత్త సీరియల్..చికాకుగా ఉంది. వాళ్ళు ఆడియన్సు కి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు. పెట్టిన టైటిల్ ఏమిటి చూపిస్తున్నది ఏమిటి" అని అంటున్నారు ప్రేక్షకులు. రివ్యూస్ అన్నీ చదివారేమో మేకర్స్ వెంటనే కత్తెర వేసే పనిలో పడ్డారు. మరి తెలుగు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో ఇప్పటికైనా అర్థమైనట్టు ఉంది అందుకే కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా ఉన్నారు. మరి ఈసారి సామ్రాట్ క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారో, తులసిని ఎలా మౌల్డ్ చేస్తారో చూడాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.