English | Telugu

Bigg Boss 9: ప్రేమించిన వాడు హింసించేవాడు.. ఫ్లోరా సైని ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-9 నిన్న గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అందులోకి సెకెండ్ కంటెస్టెంట్ గా వెళ్లిన ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని గురించి తక్కువ మందికే తెలుసు. 'ప్రేమకోసం' సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేసింది ఫ్లోరా సైని. నరసింహానాయుడు సినిమాలోని లక్స్ పాప సాంగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలో చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన '143' మూవీలోనూ నటించింది. (Flora Saini)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన ఈ భామ.. హీరోయిన్ అవకాశాలు రాకపోకవడంతో బాలివుడ్ కి వెళ్లింది. అక్కడ భిన్నమైన పాత్రలు చేసిన ఫ్లోరా సైని.. తమిళ, కన్నడ సినిమాలల్లో‌నూ నటించింది. తన ఇరవై ఏళ్ళ వయసులో ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది‌ ఫ్లోరా సైని. అయితే అతను తనని మానసికంగా, శారీరకంగా హింసించేవాడని, సినిమాలు చేయకూడదని బలవంతం చేశాడని, తన శరీరంపై గాయలతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసినట్టుగా ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక సంవత్సరం పాటు ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడని, ఒకరోజు తన పొట్టపై తన్నడంతో ఆ నొప్పిని భరించలేకపోయానని, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టిందంటూ ఎమోషనల్ అయింది ఫ్లోరా సైని.

బిగ్ బాస్ సీజన్-9 లో అడుగుపెట్టిన ఫ్లోరా సైనికి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.