English | Telugu

దేవయాని ప్లాన్‌ను చెడ‌గొట్టిన రిషి!

'వసుని నువ్వే రక్షించాలి' అంటూ రిషి, 'రిషి సర్ కి నా మీద కోపం తగ్గిపోవాలి' అంటూ వ‌సు చిట్టీలురాసి అమ్మవారి దగ్గర పెడతారు ఇద్దరూ. మరో వైపు జగతి ముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేస్తాడు మహేంద్ర. జగతి ముందరే రిషికి కాల్ చేస్తాడు కానీ రిషి కట్ చేస్తాడు. మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు రిషి లిఫ్ట్ చేసి "మళ్ళీ ఫోన్ చేస్తాను డాడ్" అని ఫోన్ పెట్టేస్తాడు. జగతి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది.

మరో పక్క రిషి ఫ్యామిలీ మొత్తం వసుధార గెలుపు మీద ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. విషయం తెలుసుకుని "ఆకాశమంత పందిరేసి, భూదేవంత పీటేసి, టీవీ చానెల్స్ ని పిలిపించి అభినందన సభ ఏర్పాటు చేయండి" అంటుంది వెటకారంగా. ఫణీంద్ర కూడా "దేవయాని చెప్పినట్లే చేయండి." అని మహేంద్రకు చెప్తాడు.

ఇక దేవయానికిఏం చేయాలో తెలీక రిషి మీద దొంగ ప్రేమను చూపిస్తూ నటిస్తుంది. ఇంతలో గౌతమ్ వచ్చి "వసుకి అభినందన సభ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను" అని రిషితో అంటాడు. దేవయాని ఆ విషయాన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తుంది. రిషి రివర్స్ లో "సభ పెట్టి వసుని అభినందిస్తే తప్పేముంది" అనేసరికి దేవయాని ప్లాన్ ఫ్లాప్ అవుతుంది.

అక్కడ వసు అక్కడున్న పిల్లలకు అన్నం కలిపి ముద్దలు పెడుతూ రిషి గురించి ఊహించుకుంటూ ఉంటుంది. ఇక రెండో రోజు రిషి.. వసు రూమ్ కి వచ్చి చూస్తూ ఉంటాడు. కానీ వసు లేకపోయేసరికి వెయిట్ చేస్తాడు. ఇంతలో వసు బిందెతో నీళ్లు తెచ్చుకుంటూ కనిపించేసరికి వసు ఇంత కష్టపడుతోందా అనుకుని మనసులో బాధపడతాడు. మిగతా సీరియల్ హైలైట్స్ కోసం ఈరోజు ఈవెనింగ్ ప్రసారమయ్యే 'గుప్పెడంత మనసు' సీరియల్ లో చూడొచ్చు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.