English | Telugu

య‌ష్ - వేద‌ల మ‌ధ్య చిత్ర ప్రేమ ర‌గ‌డ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ఏడేళ్ల క్రితం వ‌చ్చిన హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `యోహే మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించగా కీల‌క పాత్ర‌ల్లో బేబీ మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, రాజా శ్రీ‌ధ‌ర్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనంద్, మీనాక్షి త‌ద‌త‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం.

య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ త‌న చెల్లెలిని మీ త‌మ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటున్నాన‌ని అంటాడు. ఇందుకు య‌ష్ నాకు కొంచెం టైమ్ కావాలి అంటాడు. అలాగే వ‌సంత్ ని కూడా క‌నుక్కుంటాన‌ని చెబుతాడు. దీంతో హ్యాపీగా ఫీలైన దామోద‌ర్ రావు బిజినెస్ లో య‌ష్ కు మ‌రింత అండ‌గా వుంటానంటాడు. దాంతో య‌ష్ ఎలాగైనా ఆనంద్ ని పెళ్లికి ఒప్పించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. క‌ట్ చేస్తే ...వేద మాత్రం వ‌సంత్ కు చిత్ర కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని య‌ష్ తో చెబుతుంది. అది ఎట్ట‌ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌ద‌ని య‌ష్ అంటే జ‌రిగేలా చేస్తాన‌ని వేద ఛాలెంజ్ చేస్తుంది.

ఇద్ద‌రి ప్రేమ‌ను మీ బిజినెస్ కోసం బ‌లిచేయ‌వ‌ద్దంటుంది. అయినా నువ్వెరు నాకు చెప్ప‌డానికి గెట్ ఔట్ అంటూ వేద‌పై అరుస్తాడు య‌ష్‌. ఆ త‌రువాత జ‌రిగిన విష‌యాన్ని వ‌సంత్ కు చెబుతాడు. అంతే కాకుండా దామోద‌ర్ రావు చెల్లెలిని క‌ల‌వ‌మంటాడు. ఆ త‌రువాత వేద త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రికి వెళ్లి ఓ బిజినెస్ ప‌ని మీద నా బిజినెస్ పార్ట్న‌ర్ చెల్లెలు ఇక్క‌డికి వ‌స్తోంద‌ని, అమెని కొన్ని రోజుల పాటు మీ ఇంట్లో వుండ‌నివ్వాల‌ని చెబుతాడు. ఇది గ‌మ‌నించిన వేద .. చిత్ర నువ్వు ఏ విష‌యంలో వెన‌క్కి త‌గ్గొద్ద‌ని నీ ప్రేమ‌కు నేనున్నాన‌ని చెబుతుంది. దీంతో వేద - య‌ష్ ల మ‌ధ్య చిత్ర ప్రేమ ర‌గ‌డని సృష్టిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.