English | Telugu

చల్లటి బీరు తాగినంత హాయిగా ఉంది నీ వాయిస్...


పాడుతా తీయగా సీజన్ 25 కి సంబందించిన నెక్స్ట్ వీక్ ప్రోమోలో కీరవాణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే సునీత, చంద్రబోస్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సీనియర్ సింగర్ చిత్రమా పుట్టినరోజు సందర్భంగా సింగర్స్ కొంతమంది ఆమె పాటల్ని పాడారు. ఇందులో శ్రీనివాస్ దరిమిశెట్టి "హలో బ్రదర్" మూవీ నుంచి "అల్లరి కోయిల" సాంగ్ పాడాడు. చంద్రబోస్ ఈ సాంగ్ మీద కామెంట్ చేశారు. "కొంతకాలం పాటు జనాలందరినీ ఉర్రూతలూగించిన పాట ఇది" అన్నారు. ఇక సునీత ఐతే "అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాట ఏలుతూనే ఉంది" అన్నారు. ఇక ఇప్పుడు కీరవాణి అందుకున్నారు..

"చల్లటి బీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో అంతా హాయిగా ఉంది నీ వాయిస్" అన్నారు. శ్రీనివాస్ తెలుగు ఇండియన్ ఐడల్ లో 1st రన్నరప్ గా వచ్చాడు అలాగే చిరంజీవి చేతుల మీదుగా రెండు లక్షల కాష్ ప్రైజ్ తీసుకున్నాడు. సరేగమప 2018 లో 2nd రన్నరప్ గా నిలిచాడు. ఇక ప్రోమో చివరన కీరవాణి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "పాత్రికేయులు నన్ను.. నన్నంటే నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులూ పాడుతున్నారు. ఎందుకు పరభాషా గాయకులు అంటున్నారు. పాడితే తప్పేంటి ? అది కాదు అడగాల్సిన ప్రశ్న" అంటూ కామెంట్ చేసారు. ఇక సింగర్ సునీత ఐతే "చిత్రమ్మ అలా వచ్చి నిల్చుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. " అన్నారు. గత ఎపిసోడ్స్ లో ఈ షో జడ్జెస్ ఐన కీరవాణి, సునీత, చంద్రబోస్ మీద సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే.



Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.