English | Telugu

తప్పిపోయిన సుమ కొడుకు


ఈటీవీలో కాష్ ప్రోగ్రాం ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోకి సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా అప్పుడే రిలీజ్ ఐన కొత్త సినిమాల టీమ్స్ ని కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి స్టేజి మీద గేమ్స్ ఆడిస్తూ ఉంటారు సుమ . రకరకాల జోక్స్, డ్యాన్సులు అన్ని ఎలిమెంట్స్ ఈ షోలో కనిపిస్తాయి. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి 10th క్లాస్ డైరీస్ టీమ్ వచ్చింది. ఇందులో శ్రీరామ్, భానుశ్రీ, రాము, రామారావు, సురేష్ అంత కనిపిస్తారు. వీళ్ళతో రకరకాల ఆటలు ఆడించింది సుమ. ఇందులో తన కొడుకు తప్పిపోయాడంటూ ఒక ప్రకటన ఇస్తుంది సుమ .

చాలామంది సుమ కొడుకుని అంటూ వస్తూ ఉంటారు. వాళ్ళతో మస్త్ ఎంటర్టైన్ చేసింది సుమ. ఇంతలో రాము వచ్చి నేను నీ కొడుకుని అమ్మ నన్ను గుర్తుపట్టలేదా..లోకల్ గా బస్సు పాస్ లేదంటే పాస్పోర్ట్ ఇచ్చి పంపించావ్ ..విదేశాలకు వెళ్ళొచ్చాను అంటూ చెప్పేసరికి "ఓరిని నువ్వు నా కొడుకువా. అదే నిజమైతే ఇందులో ఏదో ఒకటి తినేయాలి" అంటూ "ఎదురుగా అల్లం, వేపాకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర" చూపిస్తుంది. వేపాకు తిని చాలారోజులయ్యింది అంటూ వాటిని తినేస్తాడు రాము. అబ్బా అచ్చం మేక తింటున్నట్టే ఉందిరా అంటూ సెటైర్ వేస్తుంది సుమ. ఇంతలో రామారావు వచ్చి అమ్మ నేను కొడుకునే అమ్మ గుర్తుపట్టట్లేదా అమ్మా ? అంటూ కృష్ణ గారి స్టైల్ లో అడిగేసరికి నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి తల్లినయ్యానా ?. అంటూ సుమ అడుగుతుంది. తర్వాత శ్రీరామ్ "ఎక్కడున్నావమ్మా" అనే సాంగ్ కి మంచిగా డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించారు. చివరిగా శ్రీరామ్ త్రిషతో కలిసి షూటింగ్ చేసే టైములో సెట్ లో జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ కారణంగా తన లైఫ్ ఎంత రిస్క్ లో పడిందో చెప్పేసరికి అందరికీ కాస్త బాధకలిగింది. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. శ్రీరామ్ సాంగ్ "ఎక్కడున్నావమ్మా " ఆల్ టైం ఫేవరెట్ అంటూ , చాల రోజుల తరువాత శ్రీరామ్ గారు హ్యాపీ ఉండడం చూసాం. మంచి నటుడు, సుమ గారు ఎక్కడున్నా చక్కగా ఎంటర్టైన్ చేస్తారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.