English | Telugu

Brahmamudi : అప్పు, కళ్యాణ్ ల శోభనం.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగలడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -730 లో.....అప్పు దగ్గరికి కళ్యాణ్ వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. మనకి ఫస్ట్ నైట్ జరగలేదు గుర్తు ఉంది కదా అని అప్పు అంటుంది. కళ్యాణ్ చెంపపై అప్పు ముద్దు పెట్టి బయటకు పరిగెడుతుంది. తన వెనకాలే కళ్యాణ్ వస్తాడు. ఎదురుగా ధాన్యలక్ష్మి ఉంటుంది. అప్పు కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ తడబడుతూ అంటే అమ్మ.. ఫ్రెండ్ శోభనం గురించి మాట్లాడుకుంటున్నామని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత వీడిని ఏం అడగలేదు.. లేదు అంటే వీళ్ళకి శోభనం జరగలేదా.. నా కొడుకు కి ఏ సుఖం లేకుండా చేస్తుంది ఆ అప్పు అని ధాన్యలక్ష్మి కోపంగా అంటుంది.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. ఏంటి బావ అంత హుషారుగా ఉన్నావని యామిని అడుగుతుంది. ఏంటి బాబూ ఎప్పుడు వెళ్తున్నావో ఎప్పుడు వస్తున్నావో ఏం అర్ధం కావడం లేదు.. నీ కోసం ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు కదా అని యామిని వాళ్ళ నాన్న రాజ్ తో అంటాడు. రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బావ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు.. రేపు ఆ కావ్యకి ప్రపోజ్ చేస్తున్నాడని యామిని అంటుంది.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఆ అప్పు నా కొడుకుని దూరంగా ఉంచుతుందని ధాన్యలక్ష్మి చెప్తుంది. నేను చెప్పినట్టు చెయ్.‌ దాంతో అది ఉద్యోగం మానేస్తుంది. నీకు చేతిలో మనవడిని పెడుతుంది. నువ్వు అర్జెంట్ గా శోభనానికి ముహూర్తం పెట్టమని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రేపు రాజ్ నీకు ప్రపోజ్ చేస్తున్నాడు కదా అని కావ్యని స్వప్న, అప్పు ఆటపట్టిస్తారు.. ఆ తర్వాత స్వప్న నగలు తనకి తెలియకుండా రాహుల్ దొంగతనం చేస్తాడు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ కలిసి మాట్లాడతాడు దూరంగా ఉంటే ప్రేమగా మాట్లాడుతావు.. ఇలా దగ్గరగా ఉంటే కంగారుపడతావని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.