English | Telugu

Brahmamudi : రాజ్ కారులో సామంత్ శవం.. అక్క భర్తని అప్పు అరెస్ట్ చేయనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -650 లో......కావ్య ఫ్రూట్స్ బాస్కెట్ లో సర్దుతుంటే అప్పుడే రాజ్ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు మీకు మూడ్ రావాలంటే ఏ బూత్ బంగ్లాకో వెళ్ళాలి కదా అందుకే అని కావ్య అంటుంది. ఏయ్ అంటూ కావ్యపై రాజ్ అరుస్తాడు. నాకు నెల తప్పాలని ఉంది.. స్వప్న అక్కలాగా నాకూ ఒక బిడ్డని కనాలని ఉందని కావ్య అనగానే.. నాకు నువ్వు నెల తప్పాలని ఉందంటూ కావ్య దగ్గరగా రాజ్ వస్తాడు. కావ్యని రాజ్ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు.

మరుసటి రోజు కళ్యాణ్ నిద్ర లేవగానే ఒక ప్రొడ్యూసర్ కాల్ చేసి నీకు ఒక సినిమాలో ఆల్ సాంగ్స్ కి రాసేలా ఛాన్స్ ఇస్తున్నా అంటాడు. అలా కుదరదు అండి మా గురువు గారికి మాటిచ్చానని కళ్యాణ్ అనగానే మీ గురువు గారు చెప్పారు. అందుకే నీకు ఛాన్స్ ఇస్తున్నాను‌.. కావాలంటే మీ గురువు గారికి ఫోన్ చేసి నాకు మళ్ళీ చెయ్ అని ప్రొడ్యూసర్ అంటాడు. దాంతో కళ్యాణ్ లిరిక్ రైటర్ లక్ష్మికాంత్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒళ్ళంతా దెబ్బలతో పక్కనే అప్పు భయపెడుతుంటే లక్ష్మీకాంత్ ఫోన్ మాట్లాడతాడు. మంచి అవకాశం వచ్చింది ఉపయోగించుకోమని అతను చెప్పగానే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విషయం ఇంట్లో అందరికి చెప్పగానే అందరు చాల హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. రాత్రి రాజ్, కావ్య లు కేక్ కటింగ్ ఏర్పాటు చేస్తారు. అప్పు, కళ్యాణ్ లు ఇద్దరు కేక్ కట్ చేస్తారు. అందరు ఇద్దరిని విష్ చేస్తారు.

ఆ తర్వాత అందరు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. రాజ్ కి ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. ఎవరికి చెప్పకుండా రాజ్ వెళ్తుంటే అతడిని కావ్య చూస్తుంది. తరువాయి భాగం లో అప్పు కానిస్టేబుల్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. నిన్నటి నుండి సామంత్ కన్పించడం లేదని బావపై అనామిక కంప్లైంట్ ఇచ్చిందని అప్పు అంటుంది. కాని స్టేబుల్స్ రాజ్ కార్ లో చెక్ చెయ్యగా అందులో సామంత్ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.