English | Telugu

Brahmamudi : అత్తకి క్యాన్సర్ లేదని తెలుసుకున్న అల్లుడు.. ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -541 లో.....అప్పు, కళ్యాణ్ లు ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడు కూడా అప్పుని తప్పు పడుతుంది. నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతానంటూ ధాన్యలక్ష్మి తో కళ్యాణ్ అంటాడు. మా అమ్మ గురించి తెలుసు కదా తన మాటలేం పట్టించుకోకని కళ్యాణ్ అప్పుతో అనగానే.. ఒక కొడుకు దూరం అయితే తల్లిగా ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొగలను కానీ నేను ఆలోచిస్తుంది మా అమ్మ ఉన్నట్టుండి ఇంత గ్రాంఢ్ గా పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటుందని అప్పు అంటుంది.

ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్ళగానే.. ఏంటి సర్ రానని చెప్పారు వచ్చారని మేనేజర్ అంటాడు. నువ్వే కదా ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పావ్.. కాల్ చేసావ్ అనగానే.. లేదు సర్ నేను చెయ్యలేదు.. మీకేదో ఫేక్ కాల్ వచ్చినట్లుందని మేనేజర్ అంటాడు. శృతిని పిల్చి ఏదైనా ఇల్లీగల్ గా ఆఫీస్ లో జరుగుతుందా అని రాజ్ అడుగుతాడు. లేదు ఇప్పుడే అన్ని ఫైల్స్ చెక్ చేసి వచ్చానని రాజ్ కి శృతి చెప్తుంది. ఎవరు నాకు కాల్ చేసి ఉంటారని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కనకం దగ్గరికి అప్పు.. వెళ్లి ఏంటి ఇంత సడన్ గా పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ ఏంటని అడుగుతుంది. బంటీ చెప్పబోతుంటే.. కనకం డైవర్ట్ చేస్తుంది. కృష్ణమూర్తి రాగానే అప్పు తనతో మాట్లాడుతుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి లు మాట్లాడుకుంటుంటే.. రుద్రాణి చాటుగా వింటుంది. అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. రుద్రాణి వెనకాల నుండి రాహుల్ రాగానే రుద్రాణి భయపడుతుంది. అసలు ఎందుకు రాజ్ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఆ కనకం ఏదో మాయ చేసిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. ఏమైంది మేనేజర్ కాల్ చెయ్యలేదని చెప్పాడా.. నేనే అలా మేనేజర్ తో చేయించా.. అప్పుడు కావ్య కి ఇలాగే కాల్ వస్తే.. వెళ్ళిందని అపర్ణ అనగానే రాజ్ ఆలోచనలో పడుతాడు. కావ్య గుమ్మానికి పూలు కడుతుంటే రాజ్ వెళ్లి కావ్యని ఎత్తుకుంటాడు. అందరు చూస్తుంటారు. ఆ తర్వాత కనకం కృష్ణమూర్తిలచే కేక్ కట్ చేయిస్తారు. తరువాయి భాగంలో ముగ్గురు అల్లుళ్లు పూజలో కూర్చొని ఉంటారు అప్పు, స్వప్న కూర్చొని ఉంటారు. కావ్య కోసం చూస్తుంటే కావ్య రెడీ అయి వస్తుంది.. అపుడే రుద్రాణి ఇదంతా కనకం ప్లాన్.. క్యాన్సర్ అని అబద్ధం చెప్పిందని రుద్రాణి అనగానే.. రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.