English | Telugu

Brahmamudi : రాజ్ కి నిజం తెలిసేలా చేసిన అపర్ణ.. భార్యని ఎత్తుకున్నాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -540 లో.....ఇందిరాదేవి, అపర్ణలు కనకం ఇంట్లో వంట చేస్తుంటే.. అప్పుడే కనకం వచ్చి‌‌.. మీరేంటి వంట చేస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి అని కనకం అంటుంది. నువ్వు క్యాన్సర్ అని యాక్టింగ్ చేస్తున్నావ్ మర్చిపోయావా అని అపర్ణ అంటుంది. అవును కదా అని మళ్ళీ దగ్గుతు ఉంటుంది. నీ యాక్టింగ్ మీ అల్లుడు ముందు చూపించమని అపర్ణ అనగానే.. అల్లుడు గారిని నమ్మిస్తానని కనకం అంటుంది. ఆ తర్వాత కనకం రెడ్ కలర్ బాటిల్ కోసం వెతుకుంటూ ఉంటే.. అప్పుడే రాజ్ వచ్చి అత్తయ్య గారు వచ్చి మిమ్మల్ని ఒకటి అడగాలని అంటాడు.

మీ ప్రాబ్లమ్ డాక్టర్ కి చెప్పాను.. ఒకసారి రిపోర్ట్స్ పంపమన్నారు.. మీరు రిపోర్ట్స్ ఇవ్వండి అని రాజ్ అడుగుతాడు. నా దగ్గర రిపోర్ట్స్ ఎక్కడున్నాయని కనకం అనుకొని డైవర్ట్ చేస్తుంది. ఈ రోజు నాకు సంతోషంగా ఉంది మళ్ళీ ఈ రోజు వస్తుందో రాదో.. ఈ ఒక్కరోజు ఆగండి.. రేపు మీరేం అడిగినా ఇస్తాను.. డైరెక్ట్ నేనే వస్తానని కనకం అనగానే.. అవును ఈ రోజు అవన్నీ అని చెప్పి సంతోషంగా ఉండే రోజు డిస్టబ్ వద్దని రాజ్ అంటాడు. ఆ తర్వాత కనకం వస్తుంటే.. కావ్య ఎదురుపడి.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్? ఎప్పుడు రానీవాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి చేస్తున్నారని అడుగుతుంది. అప్పుడే అపర్ణ, ఇందిరదేవి లు వస్తారు. చేసింది కనకం కాదు నేనే ఈ పెళ్లి రోజు ద్వారా అయిన ఒకటి అవుతారని ఇలా చేసానని అపర్ణ అనగానే.. అయన మారారు అని కావ్య అంటుంది. రాజ్ మనసులో నువ్వున్నావ్.. ముందు రాజ్ కి ఇప్పటి రాజ్ కి తేడా గమనించలేదా అని అపర్ణ అనగానే.. అదంతా మీ కోసం చేసానని చెప్పారు కదా అని కావ్య వాదిస్తుంది. ఆ తర్వాత కావ్య వెళ్ళిపోయాక.. అసలు వీళ్ళు ఎలా ఒకటి అవ్వాలని కనకం ఇందిరదేవిలు అంటారు. నేనొక ప్లాన్ వేసాను.. ఏ విషయంలో కావ్యని అపార్థం చేసుకున్నాడు.. సేమ్ అలాగే ఇప్పుడు రాజ్ కి మేనేజర్ ద్వారా కాల్ చేయించి ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పిస్తాను అక్కడికి వెళ్ళాక అదంతా ఫేక్ అని తెలుస్తుంది. అప్పుడు కావ్య కి కూడా ఇలా జరుగిందని చూపొచ్చని అపర్ణ అంటుంది.

ఆ తర్వాత రాజ్ కి మేనేజర్ ఫోన్ చేసి.. ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుంది రమ్మని చెప్తాడు. రాజ్ వెంటనే వెళ్తాడు. అపర్ణ మేనేజర్ కి ఫోన్ చేసి రాజ్ వస్తుండు.. నేను చెయ్యలేదని చెప్పమని చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణి దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. అసలు ఎందుకు రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడని మాట్లాడుకుంటారు. అప్పుడే కళ్యాణ్, అప్పులు ఇంటికి వస్తారు. కళ్యాణ్ తో ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. అప్పుని తిడుతుంది. తరువాయి భాగంలో కావ్య కూడా ఇలాగే చేసిందని రాజ్ చేసినా తప్పుని అపర్ణ గుర్తుచేస్తుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ ఎత్తుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.