English | Telugu

Brahmamudi : రేవతి ముసుగు పోయింది.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసామవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -825 లో... ఇంట్లో అందరు భోజనం చేస్తుంటారు. అపర్ణ స్వరాజ్ ని మీద కూర్చోపెట్టుకొని భోజనం తినిపిస్తుంటుంది. అది చూసి రేవతి ఎమోషనల్ అయ్యి, బయటకు వెళ్తుంది. తన వెనకాలే రాజ్, కావ్య వెళ్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది.. తన మనవడిని ప్రేమగా చూసుకుంటుందని రాజ్, కావ్యలతో రేవతి అంటుంది.

ఆ తర్వాత రాజ్, కావ్య, రేవతి తిరిగి ఇంట్లోకి వెళ్తారు. ఏమైందని అపర్ణ అనగానే.. వాళ్ళ అమ్మగారు దూరంగా ఉంటారట.. నువ్వు అలా ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకుంటే వాళ్ళమ్మ గుర్తు వచ్చిందట అని రాజ్ చెప్తాడు. నన్ను కూడా మీ అమ్మ అనుకోమని అపర్ణ అంటుంది. ఎలాగైనా రేవతి ముసుగు తీయాలని రుద్రాణి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కావాలనే రేవతిపై రుద్రాణి వాటర్ పోసి ముసుగు తియ్యబోతుంటే.. అప్పుడే అపర్ణ కోప్పడుతుంది.

మరొకవైపు కావ్య గురించి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకొని అప్పు బాధపడుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కావ్య పడిపోతుంటే రాజ్ చూసి మెల్లిగా కడుపులో నా బిడ్డ ఉందని అంటాడు. మన బిడ్డ అని కావ్య అంటుంది. వాళ్లని చూసి పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కంటున్నారని కళ్యాణ్ తో అప్పు అంటుంది. ఆ తర్వాత సాయంత్రం సరదాగా చీటీ గేమ్ ఆడుతారు. చీటీ లో వచ్చింది చెయ్యాలి. తరువాయి భాగంలో ముసుగులో వచ్చింది రేవతి అని అందరికి తెలిసిపోతుంది. నాకు ముందే తెలుసని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.