English | Telugu

Brahmamudi : అమ్మ పుట్టినరోజున కేక్ కట్ చేయించిన రాజ్.. యామిని షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -699 లో.. రాజ్, కావ్య ఇద్దరు పూజరి దగ్గరికి వస్తారు. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు.. తన పేరు భానుమతి.. తన పేరున అర్చన చెయ్యండి అని పూజారికి రాజ్ చెప్తాడు. గోత్రం చెప్పండి అని పూజరి అనగానే నా చిన్నప్పుడు అమ్మ, నాన్న చనిపోయారు.. నాకు గోత్రం తెలియదని రాజ్ అనగానే దూరం నుండి అదంతా చూస్తున్న అపర్ణ బాధపడుతుంది.

మరొకవైపు బావ ఇంకా రావడం లేదేంటి.. ఒకవేళ ఎవరైనా కలిసారా.. లేక ఎవరినైనా కలవడానికి వెళ్లాడా అని వైదేహితో యామిని అంటుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య కలిసి అన్నదానం చేస్తారు. నా కొడుకు నా కోసం అన్నదానం చేస్తుంటే.. నేను ఎందుకు దూరంగా ఉండాలని అపర్ణ వెళ్లి భోజనానికి కూర్చుంటుంది‌. అపర్ణని చూసిన రాజ్.. ప్లేట్ పెట్టి భోజనం వడ్డీస్తాడు. ఈ రోజు నా పుట్టినరోజు కూడా అని అపర్ణ చెప్పగానే.. అపర్ణని విష్ చేస్తాడు రాజ్. ఇక అలా రాజ్ తో మాట్లాడుతూ అపర్ణ మురిసిపోతుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి. ఆవిడ పుట్టినరోజు కూడా ఈ రోజే అంట పాపం.. తన కొడుకు దూరం గా ఉన్నాడటా.... ఒకపని చేద్దామా మా అమ్మ పుట్టినరోజు.. తన పుట్టినరోజు ఒకేరోజు కాబట్టి అవిడ చేత కేక్ కట్ చేయిద్దామని రాజ్ అనగానే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ అపర్ణ దగ్గరికి వచ్చి మీతో కేక్ కట్ చేయిద్దామనుకుంటున్నామని అనగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో అపర్ణ చేత రాజ్ కేక్ కట్ చేయిస్తాడు. అక్కడికి యామిని వచ్చి ఎవరు ఈమె అని అపర్ణని ఉద్దేశించి అడుగుతుంది. అమ్మ అని రాజ్ అనగానే యామిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.