English | Telugu

Brahmamudi : కోమాలోకి వెళ్లిన అపర్ణ.. కావ్యను ఇంట్లో నుండి గెంటేయ్ రాజ్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -510 లో.... అపర్ణ ఎప్పటిలాగే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుంటుంది. మరొకవైపు ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ వచ్చిందని కావ్య ఆఫీస్ కి వెళ్లి అక్కడ మేనేజర్ ని అడుగుతుంది. మేం ఏం చెయ్యలేదని అతను చెప్పగానే తనకి వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తుంది. ఫోన్ కలవదు ఒకసారి అన్ని ఫైల్స్ చెక్ చెయ్యాలని కావ్య అంటుంది. మరోకవైపు అపర్ణకి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో కావ్యకి ఫోన్ చేస్తుంది. తను లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత అంత బాధలో కూడ రాజ్ కి చేసి నాకు ఇబ్బందిగా ఉంది రా త్వరగా అంటూ చెప్తుంది.

అసలు ఏమైంది అమ్మకి ఆలా మాట్లాడింది అంటూ రాజ్ తో సహా అందరు ఇంటికి వెళ్తారు. అక్కడ కింద పడిపోయి ఉన్న అపర్ణని చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కార్ లో కావ్య ఇంటికి వస్తుంటే రాజ్ వాళ్ళు బయటకు వెళ్తారు. అపర్ణ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాక కావ్య నేను చూసుకుంటానంటే వదిలి వెళ్ళాం.. అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడే అత్తయ్యకి ఏమైంది అంటు కావ్య అడుగుతుంది. రాజ్ కోపంగా ఎక్కడికి వెళ్ళావ్.. మా అమ్మకి ఏమైనా అయితే చంపేస్తానని కావ్యపై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి బీపీ ఎక్కువ అయింది. కోమాలోకి వెళ్ళింది. ట్రీట్ మెంట్ కీ రెస్పాండ్ అయితే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ అనగానే మీరు అలా అనకండి మా అమ్మ ని కాపాడండి అంటూ డాక్టర్ పై రాజ్ అరుస్తాడు.

ఆ తర్వాత అందరూ వెళ్లిపోండి.. ఇక్కడ మా డాడ్ నేను ఉంటామని రాజ్ అంటాడు. అందరు ఇంటికి వెళ్తారు. అపర్ణని రాజ్ చూస్తూ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు కళ్యాణ్ కి అపర్ణ హాస్పిటల్ లో ఉందని తెలిసి హాస్పిటల్ కి వస్తాడు. అమ్మకి ఏం కాదు రేపు చూడు ఎలా మాట్లాడుతుందోనని అంటాడు. ఎవరిని నమ్మొద్దు అమ్మని మనలాగా ఎవరు చూసుకోలేరు భార్యని కుడా నమ్మొద్దంటు కోపంతో కూడిన ప్రేమతో రాజ్ మాట్లాడతాడు. తరువాయి భాగంలో ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ వస్తే వెళ్ళానని కావ్య అనగానే.. జరిగితే నీకెందుకు మా అమ్మకి ఏదైనా అవ్వాలి.. నిన్ను జన్మలో క్షమించనని రాజ్ అంటాడు. ఏదో జరిగే వరకు ఎందుకు ఈ దరిద్రాన్ని ఇప్పుడే ఇంట్లో నుండి గెంటేయ్ రాజ్ అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.