English | Telugu

Brahmamudi : భర్తపై రివెంజ్ తీసుకున్న భార్య.. ఆ ఇద్దరు ఎలా ఉన్నారంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -493 లో.....కళ్యాణ్ ఇంటికి రాగానే అప్పు భోజనం వడ్డీస్తుంది. అది తిని బాగుందని కళ్యాణ్ చెప్తాడు. ఏంటి బాగుందా అని అప్పు తింటుంది. అది తిని ఇది బాగుంది అంటావేంటని అప్పు అంటుంది. అంటే ఎక్కడ బాలేదంటే ఇవన్నీ ఎత్తేస్తావేమోనని కళ్యాణ్ అంటాడు. అంటే నేను కోపిష్టి దాన్ని అంటున్నావా అని అప్పు అంటుంది. అ తర్వాత రెండు రోజుల్లో వంట నేర్చుకుంటా అని అప్పు అంటుంది.

నా దగ్గరున్నా ఆరు వేలల్లో మూడు వేలతో సరుకులు కొనుకొస్తానని కళ్యాణ్ అంటాడు. ఇక నుండి ఇలా మనం పిలుచుకోవద్దు. నేను నిన్ను పొట్టి అని పిలుస్తానని కళ్యాణ్ అనగా... నిన్ను కూచి అంటానని అప్పు అంటుంది. ఆ తర్వాత బంటి ఆకలి అంటూ కనకం దగ్గరికి వస్తాడు. అక్కడ ఉందంటూ కనకం చిరాకు పడుతుంటే.. అప్పు, కళ్యాణ్ లని నేనే నా రూమ్ లో ఉండమని చెప్పాను. వాళ్లు అక్కడే ఉన్నారని చెప్పగానే కనకం, కృష్ణమూర్తిలు హ్యాపీగా ఫీల్ అవుతారు.అ తర్వాత రాజ్ కి కావ్య కాఫీ తీసుకొని వచ్చి.. కాఫీ కీ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. రాత్రి ఏమన్నారు ఆస్తుల కోసం కళ్యాణ్ ని రావద్దని అనుకుంటున్నానని అన్నారు కదా.. మీరు ఏం రాసిచ్చారు.. అందుకే నేను చేసే పనికి ఇక నుండి వెల కడుతానని కావ్య అంటుంది. ఏంటి రివెంజ్ ఆ అని రాజ్ అంటాడు. కావ్య వెళ్లిపోతుంటే నీకు కావలిసింది డబ్బులు కదా ఇస్తానంటూ వంద రూపాయలు ఇచ్చి.. కావ్య తెచ్చిన టీ తాగుతాడు.

మరొకవైపు అప్పుకి కళ్యాణ్ బట్టలు కొనుకుని వస్తాడు. మిగతా మూడు వేలు ఇవ్వు వాటితో సరుకులు తెస్తానని కళ్యాణ్ అనగానే.. మిగతా మూడు వేలతో నేను నీకు బట్టలు తీసుకున్నా అని అప్పు అంటుంది. మరొకవైపు రాజ్ కిందకి వస్తుంటాడు. అప్పుడే ఇందిరాదేవి కాఫీ తీసుకొని రమ్మని అంటుంది. దానికి డబ్బులు కావాలనగానే కావ్యని వచ్చి రాజ్ ఆపుతాడు. అప్పుడే అపర్ణ వచ్చి టీ కావాలి అనగానే.. తనతో కూడ కావ్య అలాగే అంటుంది. ఎక్కడ రాత్రి అన్న మాటలు కావ్య చెప్తుందో కావ్యని బయటకు తీసుకొని వెళ్లి.. నువ్వు ఎదో సరదాగా అంటున్నావనుకున్న అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఇంట్లో పూజ చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు ఆ అప్పు ఇంటికి వచ్చాక అది ఈ ఇంటికి కరెక్ట్ కోడలు కాదని తెలిసేలా చేస్తానని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.