English | Telugu

అశ్వథ్థామ ఈజ్ బ్యాక్..ఎగ్జిట్ గేట్ దగ్గరికి ఇద్దరు

బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సోమవారం నామినేషన్ల ప్రోమో రానే వచ్చింది. ప్రేక్షకులలో ఇంకాస్త ఉత్కంఠని రెకేత్తించడానికి బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రోమోని వదిలాడు. ఇక అది ఈ సీజన్ లోనే నెక్స్ట్ లెవల్ నామినేషన్ అని చెప్పొచ్చు.

నామినేషన్ లో రోహిణిని పృథ్వీ ఒక బ్యాడ్ వర్డ్ వాడారంటూ నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అనేది బ్యాడ్ వర్డ్ అనే విషయం నాకు తెలియదని రోహిణి వివరణ ఇస్తుంది. ఆ తర్వాత ప్రేరణ, హరితేజ మధ్య తగ్గ ఫర్ వార్ నడిచింది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని హరితేజ అనగానే.. నేను ఎప్పుడు మిమ్మల్ని ఫేక్ అన్నాను.. రికార్డింగ్ తెచ్చి చూపించండని ప్రేరణ అంటుంది. అలా ఎలా మాట మారుస్తావ్.. అయ్యో దేవుడా అంటూ హరితేజ సాగదీస్తుంది. ఆ తర్వాత ఎవడు నన్ను ఏమన్న నాకు భయం లేదు.. ఏం లేదు.. ఇప్పటి నుండి అన్నీ తీసేస్తున్నాను.. అశ్వథ్థామ ఈజ్ బ్యాక్ అని గౌతమ్ గట్టిగా అరుస్తాడు. సరే నువ్వు బయటకు వెళ్ళడానికి రెడీ ఆ చూసుకుందామని నిఖిల్ అనగానే.. పదా చూసుకుందామంటూ గౌతమ్, నిఖిల్ ఇద్దరు బిగ్ బాస్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్తారు.

అదంతా చూస్తున్న మిగతా హౌస్ మేట్స్ షాక్ అవుతారు. ఇలా మాటి మాటికీ గేట్ దగ్గరికి వస్తే బిగ్ బాస్ ఓపెన్ చేస్తే వాళ్ళ పరిస్థితేంటి.. ఒకసారి గేట్ ఓపెన్ చేసి ఇక వెళ్ళండి అంటే దూల తీరుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రోమోనే ఈ లెవల్ లో ఉందంటే పూర్తి ఎపిసోడ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.