English | Telugu

Bigg boss 9 telugu: సుమన్ శెట్టికి అన్యాయం.. సంఛాలక్ గా ఫ్లోరా ఫెయిల్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఐదో వారం క్రేజీగా సాగుతోంది. హౌస్ లో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇందులో ఒకరిని మించి ఒకరు స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు.

సుమన్ శెట్టి, శ్రీజ ఒక టీమ్ గా ఉన్నారు. అయితే ప్రతీ టాస్క్ లో సుమన్ శెట్టి తన వంద శాతం ఎఫర్ట్స్ పెడుతుంటే శ్రీజ మాత్రం ఫెయిల్ అవుతుంది. తను టాస్క్ లని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణం. గొడవకి ముందుండే శ్రీజ ఆటల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు.. దాంతో సుమన్ శెట్టి టీమ్ వెనుకపడింది. కళ్యాణ్ గెలవాలని ఒక స్ట్రాటజీ ప్రకారం శ్రీజ సుమన్ శెట్టిని ఓడిస్తుందని అందరికి అర్థమవుతుంది. అయితే శ్రీజతో పాటుగా ఫ్లోరా కూడా అదే తప్పు చేసింది. నిన్నటి వాటర్ పూల్ టాస్క్ లో సుమన్ శెట్టి నీళ్ళలో పడుకొని ఉన్నాడు. అందులో నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల సుమన్ శెట్టి కాళ్ళు ఆ పూల్ కి తాకాయని ఫ్లోరా అనుకుంది. అయితే తన కాళ్ళు పూల్ ని తాకాయాని కన్ఫమ్ అయిన ఫ్లోరా సుమన్ శెట్టిని ఫస్ట్ ఎలిమినేట్ చేసింది. అయితే సుమన్ శెట్టి మాత్రం.. నా కాళ్ళు తాకలేదు.. నీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల మీకు అలా కన్పిస్తుందని అన్నాడు. ఇక ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వచ్చి సంఛాలక్ డెసిషన్ ఫైనల్ కదా అని చెప్పారు.

సంఛాలక్ డెసిషన్ ఫైనల్ కానీ తను సరిగ్గా చూడలేదు.. అసలు నేనెప్పుడైనా ఆర్గుమెంట్ చేశానా.. తనకి తెలియదు.. నేను చెప్తున్నాను కదా నా కాళ్ళు తాకలేదంటూ సుమన్ శెట్టి చెప్పాడు. అయితే అప్పటికే అందరు వాటర్ పూల్ ఉండటంతో సుమన్ శెట్టి అర్థం చేసుకొని టాస్క్ నుండి క్విట్ అయ్యాడు. పాపం ఫ్లోరా చేసిన మిస్టేక్ వల్ల సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది. మరి ఈ టాస్క్ లో సంఛాలక్ ఫ్లోరా చేసింది కరెక్ట్ అని మీకనపిస్తుందా కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.