English | Telugu

Bigg Boss 9: సంజన కోసం త్యాగాలు చేసిన హౌస్ మేట్స్.. రీఎంట్రీ అదుర్స్!

బిగ్ బాస్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ఇస్తున్నాడు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగార్జున స్టేజ్ పైకి రాగానే సంజనని తీసుకొని వస్తాడు. కంటెస్టెంట్స్ తో మాట్లాడి బై చెప్పి పంపిస్తు.. ఒక్క నిమిషం అంటూ వెనక్కి పిలుస్తాడు. నువ్వు మళ్ళీ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే.. హౌస్ మేట్స్ కొందరు కొన్ని త్యాగం చెయ్యాలని నాగార్జున చెప్తాడు. మీకు బ్యాటరీ పర్సెంట్ జీరో ఉంది.. అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని నాగార్జున చెప్తాడు.

అందుకు ఇమ్మాన్యుయల్ ని కెప్టెన్సీ వదులుకోవాలని నాగార్జున చెప్తాడు. నాగార్జున ఇంకా కంప్లీట్ చెయ్యకముందే ఇమ్మాన్యుయల్ తన చేతికి ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేస్తాడు. అందరు క్లాప్స్ కొడతారు. దాంతో ట్వింటీ ఫైవ్(25) పర్సెంట్ బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ చీటీలో తనూజ ఉన్నన్ని రోజులు కాఫీ తాగొద్దని ఉంటుంది. అందుకు తనూజ చాలాసేపు ఆలోచించి ఒప్పుకుంటుంది. ఇక బ్యాటరీ ఫిఫ్టీ(50) పర్సెంట్ వస్తుంది. ఆ తర్వాత శ్రీజ తన బట్టలన్నీ త్యాగం చెయ్యాలని ఆ చీటీలో ఉంటుంది‌. అందుకు శ్రీజ ఒప్పుకోదు. ఆ తర్వాత రీతూకి హెయిర్ కట్ చేసుకోవాలని ఉంటుంది. అందుకు రీతూ ఒప్పుకొని హెయిర్ కట్ చేసుకుంటుంది. అందుకు సెవెంటీ ఫైవ్(75) పర్సెంట్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నన్ని రోజులు సిగరెట్ త్యాగం చెయ్యాలని ఆ చీటీలో ఉంటుంది. కానీ అందుకు సుమన్ శెట్టి ఒప్పుకోడు. ఆ తర్వాత చివరి అవకాశంగా భరణి తన గిఫ్ట్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టాలనగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా భరణి ఆ బాక్స్ ని పెట్టేస్తాడు. దాంతో బ్యాటరీ హండ్రెడ్(100) పర్సెంట్ అవుతుంది. ఇక సంజన హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వస్తుంది.

భరణి తన గిఫ్ట్ బాక్స్ లేకుండా అసలు హౌస్ లోకి వెళ్ళనన్న వాడు ఇప్పుడు సంజన కోసం అంత త్యాగం చేసాడు. నీ కోసం త్యాగం చేసిన వాళ్ళని మర్చిపోకని సంజన తో నాగార్జున చెప్తాడు. ఇక కాసేపటికి సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అందరు వచ్చి సంజనని హగ్ చేసుకుంటారు. ఒక్క హరీష్ మాత్రం రాడు.. సంజన కూడా అతని దగ్గరికి వెళ్ళదు. ఇక సంజన గేమ్ మొదలవ్వనుందని బిబి ఆడియన్స్ అనుకుంటున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.