English | Telugu

బిగ్‌బాస్ : విన్న‌ర్ ఎవ‌రో ర‌న్న‌ర్ ఎవ‌రో తేల్చేశారు

బిగ్‌బాస్ హౌస్‌లో అస‌లు ఆట ఇప్పుడే మొద‌లైంది. తాజా సీజ‌న్ 14వ వారంలోకి ఎంట‌రైంది. దీంతో హౌస్‌లో మిగిలిన ఇంటి స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కుల్లోనూ టెన్ష‌న్ మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా బిగ్‌బాస్ ఇచ్చిన ర్యాంకింగ్ టాస్క్‌తో ఈ సీజ‌న్ విజేత ఎవ‌రో .. ర‌న్న‌ర్ ఎవ‌రో ఇంటి స‌భ్యులు స్ప‌ష్టంగా తేల్చేశారు. 19 మంది ఇంటి స‌భ్యుల‌తో మొద‌లైన ఈ సీజ‌న్‌లో ఇప్పుడు 6 మాత్ర‌మే మిగిలారు.

బిగ్‌బాస్ : ఇంత‌కీ 13 వారాల‌కు పింకీకి ఎంత ద‌క్కింది?

ఈ ఆరు గురు ఇంటి స‌భ్యుల్లో ఒక‌టి నుంచి ఆరు వ‌ర‌కు ఎవ‌రెవ‌రు ఏయే ర్యాంకుల్లో వుండాలో నిర్ణ‌యించాల‌ని అలా నిర్ణ‌యించిన వాటి వెన‌కాల ఇంటి స‌భ్యులు నిల‌బ‌డాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. రంగంలోకి దిగిన స‌న్నీ, ష‌ణ్ముఖ్‌, కాజ‌ల్, సిరి ఫ‌స్ట్ ర్యాంక్ నాకు కావాలంటే నాకు కావాల‌ని పోటీప‌డ్డారు. మ‌రీ ముఖ్యంగా కాజ‌ల్, సిరి ఫ‌స్ట్ ర్యాంక్ నాకు కావాలంటే నాకు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. సిరి మాట మార్చి ఫ‌స్ట్‌లో త‌న‌కంటే ష‌న్నుని చూడాల‌ని వుంద‌ని తెలిపింది.

బిగ్‌బాస్ విజేత‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

ఇక కాజ‌ల్ త‌ను మాత్ర‌మే ఫ‌స్ట్ ర్యాంక్‌లో వుండాల‌ని ప‌ట్టుబ‌ట్టింది ఈ సంద‌ర్భంగా స‌న్నీ చెప్పిన డైలాగ్ న‌వ్వులు పూయించింది. అతిగా ఆశ‌ప‌డిన ఆడ‌ది.. అతిగా ఆవేశ‌ప‌డిన మ‌గాడు సుఖ‌ప‌డిన‌ట్లు చ‌రిత్ర‌లో లేదంటూ `న‌ర‌సింహా` డైలాగ్‌ని చెప్పి న‌వ్వించాడు. చాలా డిస్క‌ర్ష‌న్స్ త‌రువాత హౌస్‌లోని మెజారిటీ వ‌ర్గః ఇంటి స‌భ్యుల ర్యాంక్‌ల‌ని తేల్చేసింది. ఫ‌స్ట్ ర్యాంక్‌లో స‌న్నీ, రెండ‌వ ర్యాంక్‌లో ష‌న్ను, మూడ‌వ ర్యాంక్‌లో కాజ‌ల్‌, నాలుగో ర్యాంక్‌లో శ్రీ‌రామ్‌, ఐద‌వ ర్యాంక్‌లో మాన‌స్‌, ఆర‌వ ర్యాంక్‌లో సిరి నిల‌బ‌డ్డారు. దీంతో ఇంటి స‌భ్యులు విన్న‌ర్ ఎవ‌రో .. ర‌న్న‌ర్ ఎవ‌రో క్లారిటీ ఇచ్చేసిన‌ట్ట‌యింది. వ‌చ్చే వారం 6వ ర్యాంక్‌లో నిలిచిన సిరి ఎలిమినేట్ అయితే మిగ‌తా వాళ్లంతా టాప్ 5కి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.