English | Telugu

First Finalist Kalyan Padala : బిగ్ బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ పవన్ కళ్యాణ్ పడాల!

ఇది కదా కామన్ మ్యాన్ పవర్.. పవన్ కళ్యాణ్ పడాల మరోసారి ఋజువు చేసుకున్నాడు. కథ క్లైమాక్స్ కి వచ్చే కొద్ది కళ్యాణ్ విజయం వైపు అడుగులు వేస్తున్నాడు. మొదటి నాలుగు వారాలు అసలు హౌస్ లో పెద్దగా గుర్తింపు లేదు కానీ ఆ తర్వాత నుండి ఫుల్ ఆడుతున్నాడు.

పడిలేచిన కెరటంలా పవన్ కళ్యాడ్ పడాల ముందుకెళ్తున్నాడు. రమ్య మోక్ష, దువ్వాడ మాధురి వచ్చినప్పుడు కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడిన పట్టించుకోలేదు.. ఎప్పుడు అయితే శ్రీజ రీఎంట్రీ ఇచ్చి తనకి అన్నీ చెప్పిందో .. అప్పటి నుండి తన ఆటతీరు మారింది. నిన్నటి ఎపిసోడ్ లో అతని ఆట చూస్తే ఎవరికైనా ఇదే నిజమనిపిస్తుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు సాగిన టికెట్ టు ఫినాలే రేస్ లో కళ్యాణ్ విజయం సాధించాడు. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం. మొదటగా రీతూ, భరణిల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ లకి ఓ టాస్క్ ఇవ్వగా అందులో కళ్యాణ్ గెలుస్తాడు. ఇక అదే గేమ్ ని రీతూ, ఇమ్మాన్యుయేల్ ఆడతారు. అందులో రీతూ గెలుస్తుంది.

ఇక ఫైనల్ రేస్ రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ పడాల మధ్య జరిగింది. ఈ టాస్కులో గోనిసంచెలు తీసి విసరడం.. టన్నెల్ నుంచి పాకడం.. ఆ తర్వాత ఓ పైప్ మీద నుంచి నడవడం.. ఇవన్నీ దాటాక ఓ టన్నెల్ కి ఉన్న లాక్ తీసి అందులో నుండి బాల్స్ తీసుకొని తమకి కేటాయించిన బుట్టలో పడేయాలి. వీటి తర్వాత తమ ఫోటో ఉన్న పేపర్స్ ని సరైన క్రమంలో జతచేయాలి. అలా ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే విజేత.‌ ఇక ఈ టాస్క్ పవన్ కళ్యాణ్ పడాలకి చాలా ఈజీ . ఎందుకంటే అతనికి మిలటరీ ట్రైనింగ్ లో ఇవే ఉంటాయి. ఇక ఈ గేమ్ లో సూపర్ ఫాస్ట్ గా వచ్చి టాస్క్ ముగిస్తాడు కళ్యాణ్. రీతూ ఓడిపోయి టికెట్ టూ ఫినాలే నుండి తప్పుకుంటుంది. కళ్యాణ్ విజేతగా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ది సీజన్-9 (First Finalist Of the Season 9 Telugu ) అవుతాడు. ఆ తర్వాత ఆ ఫైనలిస్ట్ ట్రోఫీ పట్టుకొని గాల్లోకి చూపిస్తాడు. కాసేపటికి బిగ్ బాస్ మామ సాంగ్ వేస్తాడు. హౌస్ మేట్స్ అంతా స్టెప్పులు వేస్తారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.