English | Telugu

మాన్సీకి చుక్క‌లు చూపించిన అను

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. విజ‌య‌వంత‌మైన మ‌రాఠీ సీరియ‌ల్ `తుల‌ఫ‌టేరే` ఆధారంగా తెలుగులో న‌టుడు, `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త జ‌న్మ‌ల ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో రూపొందింది. కీల‌క పాత్ర‌లో క‌న్న‌డ న‌టి వ‌ర్ష న‌టించింది. రాజ‌నందిని ఆత్మ ఆర్య కోసం త‌పించే ఫాంట‌సీ క‌థ నేప‌థ్యంలో రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త ఏడాది కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

మంగ‌ళ‌వారం రాత్రి ఎపిసోడ్ హైలైట్స్ ఒక‌సారి చూద్దాం. గాఢ నిద్ర‌లో వున్న అను వెంట‌నే లేచి రాజ‌నందిని రూమ్‌లోకి వెళుతుంది. గ‌దిలోకి వెళ్లాక అను నుంచి రాజ నందిని ఆత్మ బ‌య‌టికి వ‌స్తుంది. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్ అయిన అను ఎవ‌రు మీరు అని అడుగుతుంది. అను క‌ళ్ల ముందున్న ఆత్మ నా పేరు రాజ‌నందిని అని చెబుతుంది. నేనే నువ్వు.. నువ్వే నేను అని చెప్ప‌డంతో అను కొంత క‌న్ప్యూజ‌న్‌కి గుర‌వుతుంది. మ‌రి మిమ్మ‌ల్ని ఏం చేశార‌ని అను అడిగితే చంపేశార‌ని, నా లాగే నిన్ను కూడా అంతం చేయాల‌ని చూస్తున్నార‌ని చెబుతుంది రాజ‌నందిని.

ఇదిలా వుంటే అను... రాజ‌నందిని గ‌దిలోకి వెళ్లిన విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మాన్సీ ఎలాగైనా అనుని అంద‌రి ముందు దోషిగా నిల‌బెట్టాల‌ని ప్లాన్ చేస్తుంది. వెంట‌నే డోర్ లాక్ చేసేసి అంద‌రిని వెళ్లి పిల‌వాల‌ని వెళ్ల‌బోతుంది. ఇంత‌లో అను వెళ్లిపోతే ఇంత వ‌ర‌కు చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా అని అక్క‌డే కాప‌లా కాస్తూ వుంటుంది. క‌ట్ చేస్తే రాజ నందిని త‌ను వ‌చ్చిన విష‌యం మ‌ర్చిపోతావ‌ని, అలా అయితే నిన్ను కూడా కాపాడ‌టం క‌ష్టం అవుతుంద‌ని అనుకి చెప్పి గుర్తుల కోసం ఓ డైరీలో రాసుకోమంటుంది. అలా డైరీలో రాసుకుని గ‌దిలోంచి బ‌య‌టికి వ‌చ్చేస్తుంది అను. అయితే అనులో రాజ‌నందిని ఆత్మ అలాగే వుంటుంది. ఈ విష‌యం తెలియ‌ని మాన్సీ.. అను రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయావ‌ని, ఈ విష‌యాన్ని అంద‌రికి చెప్పేస్తానంటుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అను .. మాన్సీకి చుక్కులు చూపించేస్తుంది. మంగ‌ళ వారం జ‌రిగిన ఈ ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.