English | Telugu

శ్రీదేవి డ్రామా కంపెనీలో అంజలి సీమంతం..కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ, రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఈ ప్రోమోలో అంజలిపవన్ కి సీమంతం చేసే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ సీమంతం చేసింది ఎవరో కాదు హోస్ట్ తమ్ముడు రవి..."నేను చందమామ కలిసి మా అక్కకు సీమంతం చేస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు. భార్య సీమంతం సందర్భంగా పవన్ ఐతే ఫుల్ జోష్ తో యమా స్పీడ్ తో డాన్స్ చేసాడు. కానీ ఆ స్పీడ్ డాన్స్ తనకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళ నాన్న పరువు తీసేసింది చందమామ. ఇక శ్రీ సత్య, చందమామ కలిసి "చల్ల గాలి" సాంగ్ కి ఐ-ఫీస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత సెట్ లో ఉన్నవాళ్ళంతా కలిసి వచ్చి అంజలికి సీమంతం చేసారు. ఇక పవన్ తన భార్యకు గాజులు తొడిగాడు. ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని ఈ గాజులు వేస్తున్నా అని చెప్పాడు. తర్వాత రవి ఒక స్కిట్ వేసాడు. ప్రతీ ఇంట్లో మామఅల్లుడు ఎలా ఉంటారో తెలిపే రిలేషన్ ని ఈ స్కిట్ లో చూపించారు.

పేగు మెళ్ళో వేసుకుని పుట్టిన మేనల్లుడిని చూస్తే అరిష్టం అనే కాన్సెప్ట్ మీద ఈ స్కిట్ నడిచింది అలాగే రవికి పెళ్లయ్యాక మేనమామతో రిలేషన్ చాలా తగ్గిపోతుంది అనేది కూడా చూపించారు. ఇక ఇంద్రజ, రష్మీ కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ స్కిట్ చూసి. "ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేరు అని నేను చాలా చాలా ఫీలైన సందర్భాలు ఉన్నాయి "హార్ట్ టచ్చింగ్ పెర్ఫార్మెన్స్ నిజంగా చాల బాగుంది అక్షరంలో ఒక్క మా కాదు రెండు మా లు ఉంటాయి. "మామా" అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుని రష్మీ. తర్వాత స్టేజి మీద అంజలి సోదరుడు వచ్చాడు. "ఒక నాలుగేళ్లు అనుకుంట వాడు నేను అసలు మాట్లాడుకోలేదు" అని చెప్పి ఏడ్చేసింది. ఈ ప్రోమోలో చాన్నాళ్లకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ వచ్చి "చెలియా నిను చూడకుండా" "దేవుడు వారమందిస్తే" అనే అనే సాంగ్స్ పాడారు. దాంతో రవి "మీరు పాట పాడుతుంటే నాకు క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది" అంటూ చెప్పాడు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.