English | Telugu

తినడానికి డబ్బులు లేవు.. ప్రముఖ హీరో సంచలన స్పీచ్ 

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)త్రిపాత్రాభినయం చేసిన మూవీ 'జై లవకుశ'(jai lava kusa). 2017 వ సంవత్సరంలో విడుదలై   మంచి విజయాన్ని అందుకుంది. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు, అభిమానులకి కూడా ఒక మెమొరీబిల్ మూవీగా నిలిచింది. ఈ మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ నటుడు 'రోనీత్ రాయ్'(Ronit Roy). 'సర్కార్ సాహై' అనే ప్రతి నాయకుడి క్యారక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా వచ్చిన 'లైగర్' లో కూడా క్రిస్టోఫర్ అనే కోచ్ పాత్ర రోనీత్ కి మంచి గుర్తింపుని తెచ్చింది.