English | Telugu

అయ్యబాబోయ్ సమీరా..సుధీర్ ని రసికుడు, పశుపతి అనేసిందేంటి...

సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో వాళ్ళు తెగ ఆడేసుకుంటున్నాడు. రీసెంట్ గ సుధీర్ ని సమీరా భరద్వాజ్ సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమోలో ఫుల్ ఫ్రై చేసి పారేసింది. గుణలో కమలహాసన్ చెప్పే కవితను సాంగ్ గా రాసే రేఖ సీన్ గుర్తుంటే చాలు. ఈ ప్రోమోలో కూడా అలాగే జరిగింది. సమీరా స్టేజి మీదకు రాగానే "నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తే మీరేమన్నా రాసిస్తే" అంటూ సుధీర్ సమీరాని అడిగాడు. "నీ మనసులో ఫీలింగ్స్ ఒక పేపర్ లో సరిపోతాయా" అని అడిగింది. "రాయి" అన్నాడు సుధీర్ "ఏంటి" అంది సమీరా. "లెటర్" అన్నాడు సుధీర్ "ఎవరికీ" అంది సమీరా "అమ్మాయిలకు అన్నాడు సుధీర్ 'ఓహో మీరు పార్కులో ప్యాంప్లెట్స్ పంచినట్టు పంచుదామని డిసైడ్ అయ్యారా ఈ ప్రేమ లేఖను" అని కౌంటర్ వేసింది సమీరా. "నా ప్రియా..ప్రేమతో" అని సుధీర్ చెప్తుండగా సమీర్ అచ్చం గుణ మూవీ హీరోయిన్ రేఖలా నవ్వింది. "ఇంకా అక్కడ నువ్వెంత ఏమీ లేదు" అని సమీరా పరువు తీసేసాడు సుధీర్. "కమ్మని నీ ప్రేమ లేఖలే రాసాడు రసికుడే..ప్యాంటు షర్టు వేసిన పశుపతొచ్చేలే.." అంటూ రాసింది. అంటే సుధీర్ ఫేస్ మాడిపోయింది.

సుధీర్ కి ప్రపోజ్ చేసింది...రష్మీనా?

సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ముందుగా శివ్ కుమార్, ప్రియాంక జైన్ వచ్చారు. రాగానే ప్రేమలో మునిగి తేలిపోయారు. వీళ్ళు ఎక్కడికి వచ్చి ప్రేమ, ప్రేమ మాటలు, ప్రేమ గులాబీలు ఇవి తప్ప ఇంకో మాట ఉండదు. "ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ కి వీళ్ళు డాన్స్ చేస్తూ వచ్చారు. ఇక షో అన్న విషయం మర్చిపోయి ప్రేమలో డాన్సుల్లో మునిగి తేలుతున్న వీళ్లకు బ్రేక్ వేస్తూ సుధీర్ వచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చాడు. ఇక ఆ గులాబీని శివ్ ప్రియాంకకు ఇచ్చి చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక వాళ్ళు ప్రేమలో మునిగితేలుతున్న టైంలో సుధీర్ అబ్బా అనుకున్నాడు. "కెమిస్ట్రీ అనేది నాకు అర్ధం కావట్లేదు" అని సుధీర్ శివ్ ని అడిగాడు.

Illu illalu pillalu : తన కష్టంతో నాన్నకి షర్ట్ కొనుక్కెళ్ళిన కొడుకు.. ప్రేమ వల్ల ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -208 లో... ధీరజ్ గురించి రామరాజు బాధపడతాడు. వాడు నేను చెప్పినట్టు వినకుండా ఫుడ్ డెలివరీ చేస్తూ కష్టపడుతున్నాడు. పాపం వాడు ఏమైనా తిన్నాడో లేదో అని తిరుపతితో  రామరాజు అంటాడు అప్పుడే ధీరజ్ వస్తుంటాడు. వాడు వస్తున్నాడు బావ.. నువ్వే అడుగు అనీ తిరుపతి అంటాడు. రామరాజు దగ్గరికి ధీరజ్ వచ్చి.. నాన్న నేను ఫుడ్ డెలివరి ఫాస్ట్ గా చేసినందుకు ఇంటెన్సివ్ ఇచ్చారు. అందుకే మీకు షర్ట్ తీసుకొని వచ్చాను తీసుకోండని ధీరజ్ అంటాడు.

జబర్దస్త్ ని మానస్ ని నేను చూసుకుంటా

జబర్దస్త్ షోకి ఈ మధ్య హోస్ట్ రష్మీతో పాటు మరో యాంకర్ గా మానస్ జాయిన్ అయ్యాడు. ఐతే బ్రహ్మముడి సీరియల్ లో మానస్ దీపికతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మానస్ ఏ షోకి వెళ్లినా ఆ షోకి దీపికా కూడా కచ్చితంగా వెళ్తుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, డాన్స్ ఐకాన్ సీజన్ 2 , చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ షోస్ లో తన కామెడీతో టిఆర్పీ రేటింగ్స్ ని ఎక్కడికో తీసుకుపోయింది. ఐతే ఈ మధ్య దీపికా హడావిడి షోస్ లో కొంచెం తగ్గింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ రష్మీ సీటుకే ఎసరు పెట్టింది. తానూ జబర్దస్త్ యాంకర్ గా రావాలనుకుంటున్నట్టు చెప్పింది.

దీపికా రంగరాజు కి ఆస్తులు ఏమీ లేవు అంట 

బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపికా ఫుల్ ఫేమస్ అయ్యింది. రాజ్ కి చక్కని జోడిగా తెలుగు ఆడియన్స్ కూడా ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు. ఐతే ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. హోస్ట్ ని ఐతే బాగా రోస్ట్ చేసింది. "ఏంటి దీపికా నీకు బూరేలంటే ఇష్టమే..బుగ్గలు బూరెల్లా ఉంటేనూ" అంది హోస్ట్. దానికి వెంటనే దీపికా "మీకు స్కెలిటన్ అంటే ఇష్టమా. సైన్స్ ల్యాబ్ లో బయట ఉండే అలా ఉన్నారు మీరు" అనేసింది. దాంతో హోస్ట్ తలపట్టుకుంది. "ప్రెజెంట్ దీపికా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి" అని హోస్ట్ అడిగేసరికి  "ఈ ప్రపంచానికే తెలుసు నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాను అని. కార్తీక దీపం ఫస్ట్ ఆఫర్ వచ్చింది నాకు.

బేబీ బంప్ తో దేవర నటి...

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి చైత్ర రాయ్. ఆమె ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో లేటెస్ట్ న్యూస్ ని అప్ డేట్ చేసింది. బేబీ బంప్ తో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే "అనదర్ హార్ట్ బీట్" అంటూ చెప్పింది. చైత్రకి ఆల్రెడీ ఒక పాప ఉంది. ఆమె పేరు నిష్క శెట్టి. "బేబీ 2 ఈజ్ లోడింగ్. త్వరలో నిష్క శెట్టి అక్క కాబోతోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్నీ మాలోనే దాచుకున్నాం. ఇక ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్ధించండి..ప్రేమ చూపించండి" అంటూ పోస్ట్ చేసింది. అలాగే వీళ్ళ ముగ్గురు ఉన్న ఒక అందమైన వీడియోని కూడా పోస్ట్ చేసింది.

బిగ్ బాస్ లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ కన్ఫర్మ్...

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ షోకి కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు బిగ్ బాస్ టీమ్ఐ తే కొంతమంది కంటెస్టెంట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఐతే రీసెంట్ ఆదిరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో పికిల్స్ రమ్య బిగ్ బాస్ సీజన్ 9 కి కంఫర్మ్ ఐనట్టు చెప్పాడు. అలాగే  బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం ఈసారి సీజన్ లో కామన్ మ్యాన్ కేటగిరీలో 9 మంది ఉండొచ్చు అని 70 % , ఉండకపోవచ్చు అని 30 % తెలుస్తోంది అంటూ పోస్ట్ చేసాడు. 9 వెర్సెస్ 9 అనే థీమ్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ అంటూ చెప్పాడు. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. వీళ్లకు చాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిట్టి పికిల్స్ అంటే చాలు ఈ ముగ్గురు సిస్టర్స్ గుర్తొస్తారు.

Karthika Deepam2 : జ్యోత్స్న, గౌతమ్ ల ఎంగేజ్ మెంట్ కోసం కార్తీక్ ఏర్పాట్లు.. అది కనిపెట్టేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -406 లో.....కార్తీక్ ఎంగేజ్ మెంట్ రింగ్స్ తీసుకొని వచ్చి సుమిత్రకి ఇస్తాడు. ఇలా ఈ రింగ్స్ నీ చేత్తో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందిరా అని సుమిత్ర అంటుంది. మీరేం కంగారు పడకండి పెళ్లి కూడా నా చేతుల మీదుగా జరుగుతుందని కార్తీక్ అంటాడు. మరొకవైపు ఈ గౌతమ్ గాడితో ఎంగేజ్ మెంట్ చెడగొట్టాలి అనుకుంటే వీడు ఏకంగా ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుంటున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఎలాగైనా వాడితో ఫోన్ లో మాట్లాడి ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది.