English | Telugu

'విరూపాక్ష' రేంజ్ ఏంటో రేపటితో తేలిపోతుంది!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తెలుగులో ఏప్రిల్ 21న విడుదలై ఘన విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అయింది. 13 రోజుల్లో రూ.75 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందా? అసలు ఈ సినిమా రేంజ్ ఏంటి? అనేది రేపటితో తేలిపోయే అవకాశముంది.

'విరూపాక్ష'ను మొదట పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఉద్దేశంతో ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో ఘన విజయం సాధించడంతో ఇప్పుడు హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల చేస్తున్నారు. రేపు(మే 5న) పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదల కానుంది. ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటే వంద కోట్లు అనేది విరూపాక్షకి చాలా చిన్న విషయం అవుతుంది. పాజిటివ్ టాక్ వస్తే, నార్త్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని సంచలనాలు నమోదు చేసినా ఆశ్చర్యంలేదు. మరి విరూపాక్ష అక్కడ కూడా సంచలనం సృష్టిస్తుందా లేదా అనేది రేపటితో తేలిపోనుంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష జోరు కొనసాగుతుందా లేదా అనే దానిపై కూడా రేపు క్లారిటీ రానుంది. ఎందుకంటే రేపు 'రామబాణం', 'ఉగ్రం' అనే రెండు చెప్పుకోదగ్గ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ రెండు సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా 'రామబాణం'కి పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమా వైపు మొగ్గుచూపే అవకాశముంది. మరి 'రామబాణం', 'ఉగ్రం' రూపంలో ఎదురవుతున్న బాక్సాఫీస్ పోరుతో విరూపాక్ష తెలుగు రాష్ట్రాల్లో మూడో వారం ఎలా నిలబడుతుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.