English | Telugu

ఓజీ ఆగమనం.. డేంజర్ లో ఆర్ఆర్ఆర్, పుష్ప-2 రికార్డులు!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం. అయితే కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేక, తన స్టార్డంకి తగ్గ సినిమాలు పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసేలా 'ఓజీ' వస్తోంది. (They Call Him OG)

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ మూవీ 'ఓజీ' అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ మూవీ.. సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక తెలుగునాట బుకింగ్స్ ఓపెన్ అయితే.. సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ లో నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు

ట్రేడ్ వర్గాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా మూడే మూడు సినిమాలు మొదటి రోజు రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. రూ.74 కోట్ల షేర్ తో 'ఆర్ఆర్ఆర్' టాప్ లో ఉండగా.. రూ.70 కోట్ల షేర్ తో 'పుష్ప-2', రూ.61 కోట్ల షేర్ తో 'దేవర' ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. 'ఓజీ' మూవీ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్'లను దాటుకొని, టాప్ పొజిషన్ కి వెళ్తుందా అనేదే ఇక్కడ ఆసక్తికరం.

'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ప్రస్తుతం 'ఓజీ'పై అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆకలితో ఉన్నారు. పైగా, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అదనపు షోలకు, అదనపు టికెట్ ధరలకు అనుమతి లభించింది. మిడ్ నైట్ షో ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణలో కూడా టికెట్ హైక్ కి అనుమతి లభించే ఛాన్స్ ఉంది. అసలే భారీ హైప్, పైగా అదనపు టికెట్ ధరలు, దానికితోడు ఇతర భారీ సినిమాల నుంచి పోటీ కూడా లేదు. సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ 'ఓజీ' మయం అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ లెక్కన తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే షేర్ పరంగా.. పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలను 'ఓజీ' క్రాస్ చేసినా ఆశ్చర్యంలేదు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.