English | Telugu

ఓజి vs పులివెందుల.. ఏం జరగబోతుంది! 

'ఓజి'(Og)తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరపడనుంది. అభిమానుల్లో ఈ మూవీకి ఎంత క్రేజ్ అంటే, గత రెండున్నర ఏళ్లుగా, పవన్ ఏ సినిమా ఫంక్షన్ లో కనపడినా, పొలిటికల్ గా మీటింగ్ లలో పాల్గొన్నా, ఓజి, ఓజి అని అరవడం ఆనవాయితీగా వస్తుంది. పవన్ గత చిత్రం 'హరిహరవీరమల్లు' రిలీజ్ టైం లో కూడా ఓజీ కోసమే తమ ఎదురుచూపులని చాలా మంది ఫ్యాన్స్ చెప్పారు. 'ఓజి' వాళ్ళల్లో అంత బలంగా నాటుకుపోయింది. ఇందుకు కారణం వాళ్ళ దృష్టిలో 'ఓజి' అంటే ఒరిజినల్ గాడ్. టైటిల్ అనౌన్స్ చేసినప్పట్నుంచి, రాజకీయంగాను, వ్యక్తిగతంగాను పవన్ చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా 'ఒరిజినల్ గాడ్ అని పిలుచుకుంటు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతంలోని 'పులివెందుల'(Pulivendula)టౌన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత సంతరించుకుందనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.ఇందుకు ప్రధాన కారణం పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గానికి 'వైఎస్ఆర్ సీపీ పార్టీ' అధినేత 'వైఎస్ జగన్'(Ys Jagan)ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పొలిటికల్ గా జగన్, పవన్ కి ఉన్న వైర్యం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు జగన్ ని విమర్శిస్తూ,పవన్ నో ఒరిజినల్ గాడ్ అంటుంటారు. జగన్ అభిమానులు కూడా జగన్ ని ఒరిజినల్ గాడ్ అని పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో 'ఓజి' పులివెందులలో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కి పులివెందులలో అభిమాన ఘనం ఎక్కువే మంది ఉన్నారు. పవన్ గత చిత్రాల ద్వారా ఈ విషయం రుజువు అయ్యింది

పులివెందుల లో మొత్తం పది వరకు థియేటర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓజి కి ఉన్న క్రేజ్ దృష్ట్యా పది థియేటర్స్ లోను ఓజి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ రోజు ముందు రాత్రి బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చింది. టికెట్ రేట్ ని 1000 రూపాయలగా ఉండగా, ఆ తర్వాత పది రోజుల పాటు ఐదవ ఆటలకి అనుమతి ఇస్తు రెగ్యులర్ గా ఉండే రేట్స్ కంటే కొంచం పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది .

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.