English | Telugu

నానికి అందని ద్రాక్షలా మారిన విజయ్ రికార్డు!

టాలీవుడ్ యూత్ స్టార్స్ లో టాప్-2 ఎవరంటే నాని (Nani), విజయ దేవరకొండ (Vijay Deverakonda) పేర్లు చెబుతారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాది, సినిమాల సంఖ్య, విజయాల పరంగా చూస్తే.. విజయ్ కంటే నాని చాలా ముందున్నాడు. అలాగే ప్రస్తుతం విజయ్ వరుస ఫ్లాప్స్ లో ఉండగా.. నాని మాత్రం 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా అన్నింట్లోనూ ముందున్న నాని.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయాడు.

టైర్ 2 స్టార్స్ లో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా విజయ్ దే. విజయ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'గీత గోవిందం' 2018లో విడుదలై రూ.130 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా వచ్చి ఏడేళ్ళవుతున్నా ఇంతవరకు ఈ రికార్డుని నాని బ్రేక్ చేయలేకపోయాడు. 2023లో వచ్చిన 'దసరా'తో నాని ఈ రికార్డు బ్రేక్ చేస్తాడని భావించారంతా. ఆ అంచనాలకు తగ్గట్టే రికార్డు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఫుల్ రన్ లో రూ.120 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. మరో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లయితే.. 'గీత గోవిందం' రికార్డు బ్రేక్ అయ్యి ఉండేది.

'దసరా' తర్వాత 'హాయ్ నాన్న' అనే క్లాస్ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించాడు నాని. ఇది రూ.75 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకుంది. అనంతరం 'సరిపోదా శనివారం' అనే మరో మాస్ సినిమాతో వచ్చి, మరోసారి రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాడు. కానీ ఫుల్ రన్ లో ఇది దసరాను కూడా క్రాస్ చేయలేకపోయింది. ఇప్పుడు హిట్-3 పై అందరి దృష్టి పడింది.

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హిట్-3'. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. 'హిట్-3'పై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా నాని మునుపెన్నడూ లేనంత వయలెంట్ గా కనిపిస్తున్నాడు. 'హిట్-3'తో మరో రూ.100 కోట్ల సినిమా.. నాని ఖాతాలో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాతోనైనా నాని 'గీత గోవిందం' రికార్డుని బ్రేక్ చేస్తాడా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు 'గీత గోవిందం' రికార్డుని విజయ్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఈ ఏడేళ్ళలో విజయ్ నుంచి ఏడు సినిమాలు రాగా, అందులో ఒకటి కూడా వంద కోట్ల క్లబ్ లో చేరలేదు. విజయ్ తన నెక్స్ట్ మూవీ 'కింగ్ డమ్'తో కమ్ బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.